వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొందరు మాజీ ప్రధానులు..: పారికర్ సంచలన వ్యాఖ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ భద్రతకు సంబంధించిన పలు వ్యూహాత్మక అంశాల్లో గోప్యత పాటించడంలో కొందరు మాజీ ప్రధానులు రాజీపడ్డారని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆయన వారి పేర్లను మాత్రం చెప్పలేదు.

పారికర్ వ్యాఖ్యల పైన కాంగ్రెస్ పార్టీ ధీటుగా స్పందించింది. ఆయన వ్యాఖ్యలు ఏమాత్రం సరికాదని పేర్కొంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి తాను చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు చూపించాలని నిలదీసింది. లేదంటే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.

 Parrikar's charge against ex-PMs sparks a row

గురువారం నాడు జాతీయ భద్రతకు సంబంధించిన హిందీ వారపత్రిక వివేక్ ప్రచురించిన ప్రత్యేక సంచికను ముంబైలో పారికర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. డిసెంబర్ 31వ తేదీ కోస్ట్ గార్డ్ ఆపరేషన్ విషయమై తాను వివరాలు చెప్పలేనని తెలిపారు.

దేశ భద్రతకు సంబంధించి వ్యూహాత్మక అంశాలను సృష్టించుకునేందుకు ఇరవై ముప్పై ఏళ్ల సమయం పడుతుందన్నారు. బాధాకరమైన విషయమేమంటే.. అలాంటి వ్యూహాత్మక అంశాలను కాపాడటంలో కొందరు మాజీ ప్రధానులు విఫలమయ్యారన్నారు. అయితే వారి పేర్లను తాను వెల్లడించలేనని, చాలామంది ప్రజలకు ఆ విషయం తెలుసునన్నారు.

మనోహర్ పారికర్ వ్యాఖ్యల పైన కాంగ్రెస్ నేత మనీష్ తివారి స్పందిస్తూ.... పారికర్ వివరణ ఇవ్వాలన్నారు. మరో కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. ఆ జాబితాలో ఎన్డీయే ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ఉన్నారా అని ప్రశ్నించారు.

English summary
Defence Minister Manohar Parrikar sparked off a controversy after he charged that some former Prime Ministers of the country had compromised “deep assets of national security.” While Mr. Parrikar refused to disclose any names, the Congress has sought an explanation and apology from him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X