మైయాస్ గ్రూప్స్ మీద రూ. 140 కోట్లు చీటింగ్ కేసు, మారిషస్ కంపెనీ ఫిర్యాదు, నకిలి సంతకంతో మోసం!
బెంగళూరు: ప్రముఖ మైయాస్ బేవరేజ్ అండ్ ఫుడ్ ప్రై. లిమిటెడ్ కంపెనీ మీద చీటింగ్ కేసు నమోదు అయ్యింది. బెంగళూరులోని జయనగర పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పీపల్ క్యాపిటల్ కంపెనీ ఫిర్యాదు చెయ్యడంతో మైయాస్ కుటుంబ సభ్యుల మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
మారిషస్ కు చెందిన పీపల్ క్యాపిటల్ ఇన్వేస్ట్ మెంట్ సంస్థ ఫిర్యాదు మేరకు మైయాస్ సంస్థలో 57 శాతం వాటాలు తీసుకుందని, రూ. 140 కోట్లు పెట్టుబడులు పెట్టారని సమాచారం. తాము పెట్టిన రూ. 140 కోట్ల పెట్టుబడులను వేరే ప్రయోజనాల కోసం మైయాస్ సంస్థ ఉపయోగించుకుందని పీపల్ కంపెనీ ఆరోపించింది.

నకిలి సంతకం చేశారని, చీటింగ్ చేశారని, క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడిన వారి మీద చర్యలు తీసుకోవాలని పీపల్ కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మైయాస్ చేసిన చీటింగ్ పనికి తమ సంస్థకు చాలా నష్టం జరిగిందని పీపల్ క్యాపిటల్ సంస్థ ఆరోపిస్తుంది.
కేసు నమోదు చేసిన జయనగర్ పోలీసులు మైయాస్ సంస్థ చీఫ్ పి. సదానంద మయ్య, ఆయన కుమారుడు సుదర్శన్ మయ్య, భార్య సునంద మయ్య, సంస్థ అధికారులు గోపాలక్రిష్ణ, గణపతి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేస్తున్నారని డీసీపీ అన్నామలై మీడియాకు చెప్పారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications