వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మైయాస్ గ్రూప్స్ మీద రూ. 140 కోట్లు చీటింగ్ కేసు, మారిషస్ కంపెనీ ఫిర్యాదు, నకిలి సంతకంతో మోసం!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రముఖ మైయాస్ బేవరేజ్ అండ్ ఫుడ్ ప్రై. లిమిటెడ్ కంపెనీ మీద చీటింగ్ కేసు నమోదు అయ్యింది. బెంగళూరులోని జయనగర పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పీపల్ క్యాపిటల్ కంపెనీ ఫిర్యాదు చెయ్యడంతో మైయాస్ కుటుంబ సభ్యుల మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

మారిషస్ కు చెందిన పీపల్ క్యాపిటల్ ఇన్వేస్ట్ మెంట్ సంస్థ ఫిర్యాదు మేరకు మైయాస్ సంస్థలో 57 శాతం వాటాలు తీసుకుందని, రూ. 140 కోట్లు పెట్టుబడులు పెట్టారని సమాచారం. తాము పెట్టిన రూ. 140 కోట్ల పెట్టుబడులను వేరే ప్రయోజనాల కోసం మైయాస్ సంస్థ ఉపయోగించుకుందని పీపల్ కంపెనీ ఆరోపించింది.

Peepul Capital Investments has alleged that they had pumped in Rs 140 Crore for 57% stake in the Maiyas group.

నకిలి సంతకం చేశారని, చీటింగ్ చేశారని, క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడిన వారి మీద చర్యలు తీసుకోవాలని పీపల్ కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మైయాస్ చేసిన చీటింగ్ పనికి తమ సంస్థకు చాలా నష్టం జరిగిందని పీపల్ క్యాపిటల్ సంస్థ ఆరోపిస్తుంది.

కేసు నమోదు చేసిన జయనగర్ పోలీసులు మైయాస్ సంస్థ చీఫ్ పి. సదానంద మయ్య, ఆయన కుమారుడు సుదర్శన్ మయ్య, భార్య సునంద మయ్య, సంస్థ అధికారులు గోపాలక్రిష్ణ, గణపతి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేస్తున్నారని డీసీపీ అన్నామలై మీడియాకు చెప్పారు.

English summary
Peepul Capital Investments has alleged that they had pumped in Rs 140 Crore for 57% stake in the Maiyas group. But Maiyas owner P Sadananda Maiyas and his family diverted money to other project through forgery and criminal breach alleged Peepul Capital. Jayanagar police have registered an FIR against Maiyas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X