పెగాసస్ నిఘా కుట్ర: మోదీ సర్కారును నిలదీయనున్న పార్లమెంటరీ కమిటీ -ఈనెల 28న భేటీకి పిలుపు
దేశ భద్రతను ప్రమాదంలోకి నెడుతూ, విదేశీ సాఫ్ట్ వేర్ ద్వారా వందల మంది ప్రముఖులపై కేంద్రంలోని మోదీ సర్కారు నిఘాపెట్టిన ఉదంతం సంచలనం రేపుతున్నది. ఇజ్రాయలీ నిఘా సంస్థ ఎన్ఎస్ఓ గ్రూప్ రూపొందించిన పెగాసస్ సాఫ్ట్వేర్.. దేశంలోని పలువురు ప్రముఖులపై నిఘా పెట్టేందుకు వినియోగించారన్న అనుమానాలు ప్రస్తుతం పార్లమెంటును కుదిపేస్తున్నాయి. ఈ ఉదంతంలో ప్రభుత్వం నుంచి సమాధానాలను రాబట్టేందుకు పార్లమెంటరీ కమిటీ కీలక అడుగులు వేస్తున్నది..
దేశంలో పెగాసస్ నిఘా ఉదంతంపై ఐటీ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ విచారణ చేపట్టనుంది. కాంగ్రెస్ నేత, లోక్సభ ఎంపీ శశీథరూర్ నేతృత్వంలోని ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈనెల 28న సమావేశానికి పిలుపునిచ్చింది. కేంద్ర ఐటీ, హోం శాఖల్లోని కీలక అధికారులను సైతం కమిటీ ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు వెలువడ్డాయి.

పెగాసస్ స్పైవేర్ నిఘా నీడలో వివిధ పార్టీల నేతలు, జర్నలిస్టులు ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో పార్లమెంటరీ కమిటీ.. ఐటీ, హోం శాఖలను ప్రశ్నించేందుకు సిద్ధమైంది. ''పౌరుల సమాచార భద్రత, వ్యక్తిగత గోప్యత అంశాలపై చర్చిస్తాం'' అంటూ కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. సమాచార, ఐటీ, హోం మంత్రిత్వ శాఖల ప్రతినిధులు కూడా కమిటీ ముందు హాజరవ్వాల్సి ఉంటుందని కమిటీ తెలిపింది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, ఇద్దరు కేంద్ర మంత్రులు, తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ, 40 మంది ప్రముఖ జర్నలిస్టులపై పెగాసస్ సాఫ్ట్వేర్తో నిఘా పెట్టి ఉండొచ్చంటూ ది వైర్, వాషింగ్టన్ పోస్ట్ వంటి 14 వార్తా సంస్థలు ఇటీవల సంచలన కథనాలు ప్రచురించాయి. ప్రముఖల ఫోన్ నెంబర్లు ఉన్న జాబితాను ప్రకటించాయి. అయితే..
ఈ జాబితాతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఎన్ఎస్ఓ గ్రూప్ ఇటీవల స్పష్టం చేసింది. ఈ స్పైవేర్ గుట్టుచప్పుడు కాకుండా మొబైల్ ఫోన్లలోకి ప్రవేశించగలదని, ఫోన్ హ్యాకైనట్టు గుర్తించడం చాలా కష్టమని ఐటీ నిపుణులు చెబుతున్నారు. ఫోన్లలో ఉన్న కీలక సమాచారాన్ని చాలా పకడ్బందీ వ్యూహంతో తస్కరిస్తుందని వారు తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా పెగాసస్ ఉదంతం వెలుగులోకి రావడంతో విపక్షాలు సర్కారుపై మూకదాడికి దిగాయి.
-
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications