విద్యార్థుల ముసుగులో జిహాదీలు, మావోయిస్టులు: అల్లర్ల వెనుక అరాచక శక్తులు: నిర్మలా సీతారామన్..!
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ దేశ రాజధానిలో కొద్దిరోజులుగా చెలరేగుతున్న హింసాత్మక పరిస్థితుల వెనుక జిహాదీలు, మావోయిస్టులు, వేర్పాటువాదుల హస్తం ఉందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. విద్యార్థుల ముసుగులో అసాంఘిక శక్తులు, అరాచకవాదులు హింసను ప్రేరేపిస్తున్నాయని చెప్పారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు, కార్యక్రమాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

విధ్వంసం వెనుక..
పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ దేశ రాజధానిలోని జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం విద్యార్థులు కొద్దిరోజులుగా ఆందోళన ప్రదర్శనలను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఆదివారం ఈ ప్రదర్శనలు కాస్తా అదుపు తప్పాయి. హింసాత్మకంగా మారిపోయాయి. బస్సులను దగ్ధం చేసే స్థాయికి చేరుకుంది. పలువురు ఆందోళనకారులు బస్సులను తగుల బెట్టారు. వాటి అద్దాలను ధ్వంసం చేశారు. ఈ చర్యలకు తాము కారణం కాదని జామియా మిల్లియా విద్యార్థులు సైతం ప్రకటించుకున్నారు.

స్పందించిన నిర్మలా సీతారామన్..
అదే సమయంలో ఢిల్లీ పోలీసులు కొందరు జామియా యూనివర్శిటీ క్యాంపస్ ఆవరణలోకి ప్రవేశించి- విద్యార్థులపై లాఠీ చార్జీ చేశారు. వారిని అక్రమంగా నిర్బంధించారు. పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ లాఠీ ఛార్జీలో 200 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటనల తరువాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ వరుస ఘటనపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ నోరు విప్పారు. విద్యార్థుల లాఠీ ఛార్జీపై ఓ కేంద్రమంత్రి స్పందించడం ఇదే తొలిసారి.

ఆందోళన గురించి.. ఏమీ తెలియదు..
జామియా విద్యార్థుల నిర్బంధం గురించి తనకేమీ తెలియదని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆదివారం రాత్రి ఏం జరిగిందనేది తన దృష్టికి రాలేదని అన్నారు. సోమవారం ఆమె ఢిల్లీలో తనను కలిసిన విలేెకరులతో మాట్లాడారు. విద్యార్థుల ముసుగులో వేర్పాటువాదులు ప్రవేశించారని ఆరోపించారు. జిహాదీలు, మావోయిస్టులు.. ఈ సందర్భాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు.

త్వరలోనే అన్నీ సర్దుకుంటాయ్..
విద్యార్థులెవరూ ఇంత భారీ ఎత్తున హింసాత్మక చర్యలకు దిగకపోవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. కొంతమంది అరాచక వాదులు విద్యార్థుల పేరుతో హింసాత్మక చర్యలకు దిగుతున్నారని, అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన తరువాతే దేశవ్యాప్తంగా ఈ పరిస్థితి ఏర్పడినట్టు కనిపిస్తోందని, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని నిర్మలా సీతారామన్ అన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications