మరోసారి తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు: ఢిల్లీలో వ్యాట్
న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలు మరోసారి తగ్గాయి. బుధవారం లీటర్కు రూ. 2 తగ్గాయి. ప్రస్తుత నెలలో ఇది రెండోసారి తగ్గింపు. కొత్త ధరలు బుధవారం అర్ధరాత్రి నుంచి అమలవుతాయి.
అయితే అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం వ్యాట్ బాదుడుతో ఢిల్లీ వినియోగదారులు తగ్గింపు ప్రయోజనాల్ని పొందే అవకాశం లేదు. పెట్రోలు ధర దేశమంతటా తగ్గగా, ఢిల్లీలో వ్యాట్/అమ్మకం పన్నును పెట్రోలుపై 20 నుంచి 25 శాతానికి, డీజిల్పై 12.5 నుంచి 16.6శాతానికి పెంచింది.
ఢిల్లీ ప్రభుత్వం వ్యాట్ను పెంచిన కారణంగా ఈ తగ్గుదల ప్రయోజనం అక్కడి వినియోగదారులకు లేకుండా పోయింది. కాగా. పన్నుల విషయంలో పొరుగు రాష్ట్రాలతో సమానత్వాన్ని సాధించేందుకే వ్యాట్ పెంచినట్లు.. ధరల పెరుగుదలను ఆప్ ప్రభుత్వం సమర్థించుకుంది.
అంతర్జాతీయ చమురు ధరల్లో తగ్గుదలతో భారత చమురు సంస్థలు ధరల్ని తగ్గించాయి. చమురు సంస్థలు ధరలు తగ్గించడానికి కొన్ని గంటల ముందు.. వ్యాట్ను పెంచడం ద్వారా ఢిల్లీ ప్రభుత్వం దేశరాజధానిలో పెట్రోలుపై లీటర్కు రూ.2.78, డీజిల్పై లీటర్కు రూ.1.83 పెంచింది.