వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లో ఫైజర్ వ్యాక్సిన్ -అనుమతి కోరిన అమెరికా ఫార్మా దిగ్గజం -క్లినికల్ ట్రయల్స్ లేకుండానే

|
Google Oneindia TeluguNews

భారత్‌లో కొవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోన్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వ్యాక్సిన్ల తయారీలో ఫ్రంట్ రన్నర్ గా ఉన్న అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్.. తన జర్మన్ భాగస్వామి బయోఎన్ టెక్ తో కలిసి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ను ఇండియాలోనూ వాడేందుకు అనుమతి కోరింది. టీకా వినియోగానికి సంబంధించి భారత్ లో తొలి దరఖాస్తు ఇదే కావడం గమనార్హం.

Recommended Video

Pfizer COVID-19 Vaccine Will Be Made Available Across UK From Next Week - UK PM Johnson

mRNA టెక్నాలజీతో ఫైజర్ అభివృద్ధిచ చేసిన BNT162b2 వ్యాక్సిన్ 95 శాతం సమర్థవంతగా పనిచేస్తుండటంతో దానిని వినియోగించేందుకు బ్రిటన్, బెహ్రెయిన్ దేశాలు ఇప్పటికే అనుమతులిచ్చాయి. అదే క్రమంలో భారత్ లోనూ అత్యవస వినియోగానికి అనుమతివ్వాలని కోరుతూ ఫైజర్ సంస్థ డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. అయితే..

తిరుపతిలో ఘోరం: మహిళను బెల్టుతో చితకబాదిన ఎస్సై -ఎంఆర్ పల్లి స్టేషన్‌లో ఘటన -షాకింగ్ కారణంతిరుపతిలో ఘోరం: మహిళను బెల్టుతో చితకబాదిన ఎస్సై -ఎంఆర్ పల్లి స్టేషన్‌లో ఘటన -షాకింగ్ కారణం

ఇండియాలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించకుండానే ఫైజర్ అనుమతులు కోరుతుతుండటం గమనార్హం. భారత్ లో కీలక దశలో ఉన్న ఐదు వ్యాక్సిన్లు స్థానికంగానే క్లినికల్ ట్రయల్స్ జరుపుకొంటుంటం, వాటి పనితీరుపై డీసీజీఐ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్న నేపథ్యంలో.. లోకల్ ట్రయల్స్ లేకుండా ఫైజర్ కు అనుమతి ఇస్తారా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది. డిసెంబర్ 4న ఫైజర్ నుంచి దరఖాస్తు వచ్చిందని డీసీజీఐ అధికారులు ధృవీకరించారు. కాగా,

Pfizer seeks approval in India for Covid vaccine besides waiver of clinical trials

ఫైజర్-బయోఎన్ టెక్ తయారుచేసిన వ్యాక్సిన్ ను మైనస్ 72 డిగ్రీల ఉష్ణోగ్రతలో స్టోర్ చేయాల్సి ఉండటం, భారత్ లో ఆ వ్యాక్సిన్ పంపిణీకి అవసరమైన కోల్డ్ చైన్ లేకపోవడం ప్రతికూలాంశంగా ఉంది. అయితే, ఇండియాలో ఫైజర్ పంపిణీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వ భాగస్వామ్యంలో మాత్రమే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నట్లు ఫైజర్ ప్రతినిధులు చెప్పారు.

కేసీఆర్ ఓటమిపై జగన్ పార్టీ ఎద్దేవా -టీఆర్ఎస్ కన్ను లొట్ట -టీడీపీ చచ్చిపోయింది -బీజేపీ పేరెత్తని వైసీపీకేసీఆర్ ఓటమిపై జగన్ పార్టీ ఎద్దేవా -టీఆర్ఎస్ కన్ను లొట్ట -టీడీపీ చచ్చిపోయింది -బీజేపీ పేరెత్తని వైసీపీ

ఇండియాలో ప్రస్తుతం ఐదు వ్యాక్సిన్లు కీలక దశకు చేరాయి. ఆస్ట్రాజెనెకా, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి సీరం ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసిన 'కొవిషీల్డ్', రష్యా తయారీ 'స్పుత్నిక్ -వి' వ్యాక్సిన్లు స్టోరేజీకి 2డిగ్రీల నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత సరిపోతుంది కాబట్టి కేంద్రం వాటివైపే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. అదేసమయంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోన్న భారత్ బయోటెక్ దేశీయంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ పైనా కేంద్రం ఆసక్తిగా ఉంది. జైదూస్ క్యాడిలా రూపొందించిన వ్యాక్సిన్ ఇటీవలే మూడో దశ ట్రయల్స్ కు చేరగా, బయోలాజికల్-ఈ సంస్థ తయారుచేసిన వ్యాక్సిన్ రెండో దశ ట్రయల్స్ లో ఉంది.

English summary
Pfizer India has become the first pharmaceutical firm to seek from the Drugs Controller General of India an emergency use authorisation for its COVID-19 vaccine in the country, after its parent company secured such clearance in the United Kingdom and Bahrain.The firm, in its application submitted to the drug regulator, has sought permission to import the vaccine for sale and distribution in the country, besides waiver of clinical trials on Indian population in accordance with the special provisions under the New Drugs and Clinical Trials Rules, 2019, official sources said. on Indian population in accordance with the special provisions under the New Drugs and Clinical Trials Rules, 2019, official sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X