హాథ్రస్ అత్యాచార ఘటన రిపోర్ట్ చేస్తున్న జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్..? ఏం జరుగుతోంది..?
హాథ్రస్ అత్యాచార ఘటనపై రిపోర్టింగ్ చేయరాదంటూ తొలుత ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆ తర్వాత ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో మృతురాలి కుటుంబ సభ్యులను కలిసేందుకు మీడియాకు అనుమతి ఇచ్చింది. అంతకుముందు ఓ జాతీయ ఛానెల్కు చెందిన మహిళా జర్నలిస్టుకు సంబంధించిన ఫోన్ ట్యాప్ అయిందనే వార్తలు రావడంతో ఇది వాస్తవమేనని సదరు ఛానెల్ ధృవీకరించింది.
హాథ్రస్ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ క్రమంలోనే ఆ ఘటనపై పూర్తిగా కవర్ చేయకుండా మీడియాపై ఆంక్షలు విధించడం జరిగింది. ఓ జాతీయ ఛానెల్కు చెందిన తనుశ్రీ పాండే అనే మహిళా రిపోర్టర్ మృతురాలి సోదరుడితో ఫోన్లో మాట్లాడింది. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తమ కుటుంబంపై ఒత్తిడి తీసుకొస్తోందంటూ మృతురాలి సోదరుడు తనుశ్రీ పాండేకు ఫోనులో చెప్పాడు. అయితే వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ టేపు బయటకు లీకైంది. అంతేకాదు దీన్ని ఓ వర్గపు సంస్థ సర్క్యులేట్ చేసింది.ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తమపై ఒత్తిడి తీసుకొస్తోందని చెప్పాలంటూ మహిళా రిపోర్టర్ తనుశ్రీ పాండే ... మృతురాలి కుటుంబ సభ్యులను బలవంతం చేస్తోందని పేర్కొంటూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు. దీనిపై ఆ సదరు ఛానెల్ స్పందించింది.
హాథ్రస్ ఘటన మృతురాలి సోదరుడితో తమ రిపోర్టర్ మాట్లాడింది వాస్తవమేనని అయితే ఆమె మాటలను కొందరు వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేసింది సదరు ఛానెల్. మృతురాలి సోదరుడితో మాట్లాడినప్పుడు ఆమె ఏం జరిగిందో చెప్పాలని అడిగిందని అందుకు సమాధానంగా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తమ కుటుంబ సభ్యలపై ఒత్తిడి తీసుకొస్తోందని సమాధానంగా చెప్పినట్లు ఛానెల్ పేర్కొంది. తన తండ్రి మాట్లాడుతున్న సమయంలో వీడియోను రికార్డు చేయాలని తనుశ్రీ మృతురాలి సోదరుడికి సూచించిందని ఛానెల్ స్పష్టం చేసింది. అంతేకాదు ప్రస్తుతం కేసులో జరుగుతున్న విచారణపై తృప్తితో ఉంటే దానిపై కూడా ఒక ప్రకటన రికార్డు చేసి విడుదల చేయాలని తనుశ్రీ ఫోనులో మాట్లాడిన సమయంలో చెప్పిందని ఛానెల్ క్లారిటీ ఇచ్చింది.
ఇదంతా ఇలా ఉంటే.... అసలు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఘటనను కవర్ చేస్తున్న జర్నలిస్టుల ఫోన్లను ఎందుకు ట్యాప్ చేస్తోందటూ ప్రశ్నించింది సదరు ఛానెల్. ఇద్దరి మధ్య జరుగుతున్న సంభాషణను రికార్డు చేయాలని ఏ చట్టం చెబుతోందని ప్రశ్నించింది. ఒకవేళ ట్యాప్ చేసి ఉంటే హథ్రాస్ ఘటన మృతురాలి కుటుంబ సభ్యలు ఫోన్ను మాత్రమే ఎందుకు ట్యాప్ చేస్తోందని ప్రశ్నించింది. ట్యాప్ చేశాక ఈ ఫోన్ రికార్డింగులను సోషల్ మీడియాలో ఎందుకు లీక్ చేశారని ఆ అధికారం ఏ చట్టమిచ్చిందని ప్రశ్నించింది.
Why are telephone calls of journalists reporting on #HathrasHorror being tapped? BJP rep on #Newstrack spoke of elaborate process for phones being tapped by Govt. Under what provision of law was the call recording of a victim’s family member and a journalist leaked by police?
— Rahul Kanwal (@rahulkanwal) October 2, 2020
ఇక మృతురాలి కుటుంబ సభ్యులను కలిసేందుకు మీడియాకు అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వంపై అన్ని వర్గాల నుంచి ఒత్తిడి రావడంతో ఎట్టకేలకు మృతురాలి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను పోలీసులు తొలగించారు. దీంతో మీడియా మృతురాలి కుటుంబ సభ్యులను కలిశారు.
Recommended Video
Right to report freely must be strongly defended by journalists of this generation. Why is Hathras victim’s family being treated like they were the accused? Why have their phones been snatched? Rule of law must prevail in our country. A state cannot be run like a banana republic.
— Rahul Kanwal (@rahulkanwal) October 2, 2020