ఓసారి చెప్పా, రెండోసారి కూడా!: లండన్లో కవిత(పిక్చర్స్)
లండన్: కాశ్మీర్ పండిట్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత శనివారం అన్నారు.
ప్రతిష్టమాత్మక కింగ్స్ కాలేజీ సదస్సు కోసం ఆమె లండన్ వచ్చారు. ఈ నేపథ్యంలో కాశ్మీర్ పండిట్లు కవితను కలిశారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయి.
పార్లమెంటులో కాశ్మీర్ పండితులకు రక్షణ కల్పిస్తూ పునరావాసానికి చర్యలు తీసుకోవాలని పార్లమెంటులో మాట్లాడినందుకు వారు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.
కల్వకుంట్ల కవిత
ఇప్పటికే ఒకసారి దీని పైన కేంద్రం దృష్టికి తాను తీసుకు వెళ్లానని, మరోమారు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ను కలిసి సత్వర కార్యాచరణ చేపట్టాలని విజ్ఞప్తి చేస్తానని కవిత కాశ్మీర్ పండిట్లకు హామీ ఇచ్చారు.
కల్వకుంట్ల కవిత
పండితుల పైన దాడులు పెరగడంతో దేశం నలుమూలలకు వెళ్లి ప్రవాసంలో బతుకు వెళ్లదీస్తున్నారని ఈ సందర్భంగా కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
కల్వకుంట్ల కవిత
కాశ్మీర్ లోయలో శాంతియుత వాతావరణం ఏర్పడితే వారంతా తమ ఇళ్లకు తిరిగి వెళ్లిపోతారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చెప్పారు.
కల్వకుంట్ల కవిత
తమవారి రక్షణ, పునరావాసానికి కేంద్ర, జమ్ము కాశ్మీర్ ప్రభుత్వాలు కృషి చేసేలా ఒత్తిడి తేవాలని పండిట్లు ఎంపీ కల్వకుంట్ల కవితకు విజ్ఞప్తి చేశారు.