కేజ్రీవాల్కు షాక్: రోహిత్ సోదరుడికి ఉద్యోగంపై కోర్టుకు
ఢిల్లీ: రోహిత్ వేముల సోదరుడికి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఉద్యోగం ఇవ్వడంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
ఇది దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో రోహిత్ వేముల సోదరుడు వేముల రాజా చైతన్య కుమార్కు ఢిల్లీ ప్రభుత్వం 'గ్రూప్ సి' ఉద్యోగం ఇచ్చింది. దీనిపై లాయర్ అవద్ కౌషిక్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఫిబ్రవరి 23వ తేదీన ఢిల్లీ కేబినెట్ ఓ నిర్ణయం తీసుకుందని, మార్చి 3వ తేదీ నుంచి రోహిత్ సోదరుడికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారని, ఇది సరికాదని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగం అన్యాయం, అక్రమం, ఏకపక్షం, రాజకీయ పరమైన నిర్ణయమని అందులో పేర్కొన్నారు.

కేబినెట్ చెప్పిన ప్రకారం.. రోహిత్ వేముల సోదరుడు.. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఉద్యోగం కావాలని కోరాడని ఉందని, కానీ రోహిత్ కుటుంబం నుంచి అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని పిటిషన్లో పేర్కొన్నారు. కేబినెట్ నిర్ణయం సరికాదన్నారు.
ఇలా ఉద్యోగం ఇవ్వడం సరికాదన్నారు. మెరిట్ పైన ఉద్యోగం సాధించాలనుకునే ఢిల్లీ యువతకు కూడా నష్టమని అభిప్రాయపడ్డారు. దీనిని న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. మే 17వ తేదీన విచారణకు రానుంది. రోహిత్ వేముల మృతి అనంతరం ఏఏపీ, కాంగ్రెస్ పార్టీ దానిని రాజకీయాలకు వాడుకున్నారనే ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications