జయలలిత ఆరోగ్యంపై ఆందోళన: హైకోర్టులో పిల్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై తక్షణమే స్పంధించి ప్రకటన చెయ్యాలని మద్రాసు హై కోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. ప్రముఖ సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి సోమవారం మద్రాస్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
జయలలిత ఆరోగ్యం విషయంపై అపోలో ఆసుపత్రి తక్షణమే స్పందించి నివేదిక సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని మద్రాసు హై కోర్టును ఆశ్రయించిన ట్రాఫిక్ రామస్వామి పిటిషన్ దాఖలు చేశారు.
తమిళనాడుకు చెందిన సుప్రీం కోర్టు న్యాయవాది రీగన్ ఎస్.బెల్ జయలలిత ఆరోగ్యం గురించి వివరాలు తెలియడం లేదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం గురించి ఎవ్వరూ స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదని లేఖలో పేర్కొన్నారు.

ఈ పరిస్థితుల దృష్ట్యా తమిళనాడు రాష్ట్రంలో 356వ అధికరణం ప్రకారం రాష్ట్రపతి పాలన విధించాలని, ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై గవర్నర్ నుంచి నివేదిక తెప్పించాలని ఆయన లేఖలో మనవి చేశారు.
తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై గత నాలుగు రోజులుగా గంటగంటకు ఎదో ఒకవిధంగా వదంతులు వ్యాపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ట్రాఫిక్ నిబంధనలకు వ్యతిరేకంగా బోర్డులు, ఫ్లక్సీలు వెలిసే సాధనాలను తొలగిస్తూ తమిళనాడు వ్యాప్తంగా మంచిగుర్తింపు తెచ్చుకున్న ట్రాఫిక్ రామస్వామి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications