ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి ఇక ‘ఆధార్’ తప్పనిసరి
న్యూఢిల్లీ: రైతులకు ఆర్థికంగా మద్దతునిచ్చేందుకు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధులు కావాలంటే ఇక బ్యాంక్ ఖాతాను ఆధార్కు తప్పనిసరిగా అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు జాతీయ దినపత్రిక ఎకనామిక్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. అయితే, దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
కాగా, ఇప్పటి వరకు ఈ పథకానికి ప్రభుత్వం ఎటువంటి నిబంధనలు విధించలేదు. నాలుగో విడత సాయం చెల్లించే సమయంలో మాత్రం బ్యాంక్ ఖాతాలను ఆధార్తో అనుసంధానం తప్పనిసరి అనే అంశాన్ని తీసుకొచ్చినట్లు తెలిసింది.
ప్రస్తుతం రూ. 10వేల కోట్ల నిధులను ఆర్థిక వ్యవస్థలోకి చొప్పించి డిమాండ్కు ఊతమివ్వాలని ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ఈ చర్యలు చేపడుతోంది.
ఆధార్తో అనుసంధానించిన బ్యాంక్ ఖాతాలకే నాలుగో విడత కిసాన్ సమ్మాన్ సొమ్ము లభిస్తుందని, ఈసారి దాదాపు రూ. 10వేల కోట్లను ఒకేరోజు అందజేసే అవకాశాలున్నాయని ఎకనామిక్స్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం(పీఎం కిసాన్) కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏటా రూ. 6వేల మొత్తాన్ని చెల్లిస్తున్న విషయం తెలిసిందే. దీనిని మొత్తం 4 వాయిదాల్లో రైతులకు చెల్లిస్తోంది. 2019-2020 మార్చిలోపు ఈ వాయిదాలను రైతులకు బదిలీ చేయాల్సి ఉంది.
కాగా, 2019 ఫిబ్రవరి 24 న ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ లో నరేంద్ర మోడీ ఈ పథకాన్ని మొట్టమొదటిగా ఒక కోటి మంది రైతులకు 2,000 నగదు బదిలీ చేయడం ద్వారా ప్రారంభించారు. చిన్న, ఉపాంత రైతుల (ఎస్ఎంఎఫ్లు) ఆదాయాన్ని పెంపొందించడానికి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో "ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం-కిసాన్)" ప్రభుత్వం కొత్త సెంట్రల్ సెక్టార్ పథకాన్ని ప్రారంభించింది.
ప్రతి పంట చక్రం చివరలో ఎదురుచూస్తున్న వ్యవసాయ ఆదాయంతో సరైన పంట ఆరోగ్యం మరియు తగిన దిగుబడులను నిర్ధారించడానికి వివిధ రకాల ఇన్పుట్లను సేకరించేందుకు ఎస్ఎంఎఫ్ యొక్క ఆర్ధిక అవసరాలకు అనుగుణంగా పీఎం కిసాన్ పథకం లక్ష్యంగా పెట్టుకుంది.
అటువంటి వ్యయాలను కలుసుకునేందుకు, వడ్డీ వ్యాపారుల బారి నుంచి పడిపోకుండా, వ్యవసాయ కార్యకలాపాల్లో వారి కొనసాగింపుకు హామీ ఇస్తామని కూడా ఇది వారిని కాపాడుతుంది. 2019 - 20 ఆర్ధిక సంవత్సరంలో రూ. 75,000 కోట్ల వార్షిక వ్యయం కాగల ఈ పథకానికి అయ్యే పూర్తి ఖర్చు భారత ప్రభుత్వం భరిస్తుంది.