రాష్ట్రపతితో మోడీ, అమిత్ షా వరుస భేటీలు.. ఏం చేయబోతున్నారో..?
రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతూ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గంటల వ్యవధిలో విడివిడిగా సమావేశమయ్యారు. ఆదివారం మధ్యాహ్నం మోడీ రాష్ట్రపతితో భేటీ కాగా, సాయంత్రం అమిత్ షా రాష్ట్రపతి భవన్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఒకే రోజున ప్రధాని, హోంమంత్రి రాష్ట్రపతితో భేటీ అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ కీలక భేటీల్లో ఏయే అంశాలపై చర్చ జరిగిందనేది మాత్రం గోప్యంగా ఉంది. అయితే, ప్రస్తుతం జూలై 21న ప్రారంభమై ఆగస్టు 12 వరకు కొనసాగనున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీలు జరిగాయి. ముఖ్యంగా, ఈ సమావేశాల్లో 'ఆపరేషన్ సింధూర్'పై కీలక చర్చలు జరుగుతున్న తరుణంలో, ప్రధాని, హోంమంత్రుల రాష్ట్రపతి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

సాధారణంగా, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వ కీలక నిర్ణయాలు, బిల్లులు లేదా జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై రాష్ట్రపతికి సమాచారం అందించడం జరుగుతుంది. అయితే, విడివిడిగా భేటీ అవ్వడం, చర్చనీయాంశమైన 'ఆపరేషన్ సింధూర్'పైనే ప్రధానంగా చర్చ జరిగి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ భేటీల వెనుక ఉన్న అసలు కారణాలు, వాటి తక్షణ ప్రభావం ఏమిటన్నది వేచి చూడాలి.
-
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications