భూసేకరణ చట్టం: సీఎంలతో మోడీ సమావేశం
న్యూఢిల్లీ: భూస్వాధీన చట్టం అమలు చెయ్యడానికి తీసుకోవలసిన చర్యలపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించడానికి రంగం సిద్ధం అయ్యింది. ఈ నెల 15వ తేది (బుధవారం) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నివాసంలో సీఎంల సమావేశానికి ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు పాల్గొంటారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులతో సహ అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకానున్నారు. ఢిల్లీలోని నెంబర్ 7 రేస్ కోర్సు రోడ్డులోని ప్రధాని మోడీ ఇంటిలో జరిగే ఈ సమావేశానికి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కు చెందిన ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు.

భూస్వాధీన చట్టం అమలు చెయ్యడానికి తాము అంగీకరించమని కాంగ్రెస్ తో పాటు పలు జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఇప్పటికే తేల్చి చెప్పాయి. అయితే పార్టీలకు అతీతంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే ఫోన్ లో మాట్లాడారు.
సమావేశానికి హాజరు కావాలని సీఎంలను ఆహ్వానించారు. భూస్వాధీనం చట్టంతో పాటు పలు విషయాలు చర్చించే అవకాశం ఉందని సమాచారం. అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పలు కారణాల వలన తాను సమావేశానికి హాజరు కాలేకపోతున్నానని ప్రధాని మోడీకి లేఖ పంపించారని తెలిసింది.
-
"అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు": భారత్ స్థానం మారింది - ప్రధాని మోడీ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications