123 దేశాలకు మందులు అందజేశాం, వ్యాక్సిన్ కనుగొనడంలో బిజీ, నామ్ దేశాధినేతలతో మోడీ
కరోనా వైరస్ను కలిసికట్టుగా ఎదుర్కొందామని ప్రధాని మోడీ అన్నారు. వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రపంచం సంక్షోభంలోకి నెట్టవేయబడిందన్నారు. ఈ సమయంలో నాన్ అలైన్ మూమెంట్ (ఆలీన విధానం) చొరవ తీసుకోవాలని కోరారు. ప్రపంచం తరఫున తన గొంతుక వినిపించాలని అభిప్రాయపడ్డారు. నామ్ దేశాలతో ప్రధాని మోడీ సోమవనం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
సంక్షోభ సమయంలో ఉద్యమించేందుకు చేసేందుకు క్రమశిక్షణ, నిర్ణయాత్మక శక్తిగా కలిసి పనిచేసేందుకు భారత్ ముందు ఉంటుందని తెలిపారు. భారతీయ నాగరికత ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా చూస్తుందని తెలిపారు. సొంత అవసరాలు ఉన్నప్పటికీ 123 దేశాలకు మందులు పంపించామని.. ఇందులో 59 దేశాలు నామ్ అని పేర్కొన్నారు. వైరస్ నివారణ కోసం వ్యాక్సిన్ రూపొందించడానికి ప్రపంచంలో భారత్ ముందువరసలో ఉంది అని మోడీ పేర్కొన్నారు.
కరోనా వైరస్పై పోరాడుతుంటే కొందరు ఉగ్రవాదులుగా మారారని ఆరోపించారు. వైరస్ వ్యాపించేందుకు పాటుపడుతున్నారని.. మరికొందరు ఫేక్ న్యూస్, వైద్యుల వీడియోలు షేర్ చేయడంలో తీరికలేకుండా ఉన్నారని ఆరోపించారు.
#COVID19 has shown us the limitation of existing international system. In the post COVID world, we need a new template of globalisation based on fairness, equality & humanity. We need international institutions that are more representative of today's world: PM Modi at NAM summit pic.twitter.com/WaOenE9ibh
— ANI (@ANI) May 4, 2020