రామ్నాథ్ కోవింద్కు వీడ్కోలు: ప్రధాని మోడీ స్వయంగా: రేపే
న్యూఢిల్లీ: దేశ ప్రథమ పౌరుడి పీఠం ఎవరిని వరిస్తుందనేది తేలిపోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం తరపున ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థిగా కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హా పోటీ చేసిన ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తోందనే విషయంపై స్పష్టత ఏర్పడింది. ఈ నెల 18వ తేదీన పోలింగ్ ముగిసిన ఈ ఎన్నికల పోలింగ్కు సంబంధించిన ఓట్ల లెక్కింపు తొలి రౌండ్ కొద్దిసేపటి కిందటే ముగిసింది. ద్రౌపది ముర్ము భారీ ఆధిక్యతను సాధించారు.
తొలి విడతలో ఎంపీల ఓట్లను లెక్కపెట్టారు. ఈ లెక్కింపు పూర్తయింది. ఇందులో ద్రౌపది ముర్ముకు 540 ఓట్లు పోల్ అయ్యాయి. ఈ ఓట్ల విలువ 3,78,000. కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్ష పార్టీలు బలపరిచిన యశ్వంత్ సిన్హాకు 208 ఓట్లు పడ్డాయి. వీటి విలువ 1,45,600. కాగా- 15 ఓట్లు చెల్లుబాటు కాలేదు. దీనితో పార్లమెంట్ సభ్యుల ఓట్ల కేటగిరీలో ద్రౌపది ముర్ము భారీ ఆధిక్యాన్ని సాధించినట్టయింది. దీని తరువాత శాసన సభ్యుల ఓట్లను లెక్కింపు చేపట్టారు ఎన్నికల అధికారులు. రెండో విడతగా ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

కాగా- ఈ ఎన్నికల్లో ద్రౌపది ముర్ము విజయం దాదాపుగా ఖాయమైనట్టే. దేశ 15వ రాష్ట్రపతిగా ఆమె ప్రమాణ స్వీకారం చేయబోతోండటం ఇక లాంఛనప్రాయమే. ఈ నెల 25వ తేదీన ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీ కాలం 24వ తేదీన ముగియబోతోంది. ఇంకో మూడురోజులు ఆయన రాష్ట్రపతి పదవిలో కొనసాగనున్నారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఘనంగా వీడ్కోలు పలకబోతోంది. ప్రత్యేకంగా వీడ్కోలు విందును ఏర్పాటు చేయనుంది. శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు ఢిల్లీలోని అశోక హోటల్లో ఈ కార్యక్రమం ఏర్పాటైంది. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా కేంద్ర మంత్రులు, పలువురు అధికారులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దీనికి హాజరు కానున్నారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications