వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడు ప్రధాని మోడీ నామినేషన్

|
Google Oneindia TeluguNews

వారణాసి : ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగుతున్న ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9.30గం.లకు బూత్ స్థాయి కార్యకర్తలతో మోడీ మాట్లాడనున్నా మోడీ... 11గంటలకు కాశీ విశ్వేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి 11.30గం.లకు నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు.

మోడీ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల నేతలు హాజరుకానున్నారు. అకాలీదళ్ నాయకుడు ప్రకాశ్ సింగ్ బాదల్, బీహార్ సీఎం నితీశ్ కుమార్, శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే, లోక్ జనశక్తి పార్టీ నేత రాం విలాస్ పాశ్వాన్‌ సహా పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

PM modi to file his nomination today in Varanasi

శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో మోడీ గురవారమే వారణాసికి చేరుకున్నారు. దాదాపు ఏడు కిలోమీటర్ల మేర భారీ రోడ్ షో నిర్వహించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు పలువురు బీజేపీ సీనియర్ నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రోడ్ షో అనంతరం ప్రధాని మోడీ గంగాహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

English summary
Prime Minister Narendra Modi will hold a roadshow in Varanasi before filing his nomination for reelection from the temple town today. All senior leaders of the BJP, NDA and North East Democratic Alliance are expected to be present in the city to mark the occasion. PM Modi is expected to begin his schedule with prayers at the iconic Kashi Vishwanath Temple.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X