కంగ్రాట్స్ ద్రౌపది ముర్ము: ప్రధాని మోడీ, నడ్డా, అమిత్ షా శుభాకాంక్షలు
భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. దీంతో ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆమెను విష్ చేశారు. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా అభినందనలు తెలియజేశారు. వీరిద్దరూ కలిసి.. ఆమెకు కంగ్రాట్స్ తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ముర్ము ఇంటికి వచ్చారు. ఆమెకు కలిసి కంగ్రాట్స్ తెలిపారు.
రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా విష్ చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ట్వీట్ చేశారు. ఇదీ ప్రజా విజయం అని తెలిపారు. ఒడిశాకు చెందిన ముర్ము.. రాష్ట్రపతిగా విజయం సాదించారు. ఇదీ తమ రాష్ట్రానికి దక్కిన గౌరవం అని సీఎం నవీన్ పట్నాయక్ అన్నారు. ఒడిశా గిరిజనుల ఆనందానికి అవది లేకుండా పోయింది. ద్రౌపది ముర్ము జర్నీ రాయ్ రంగ్పూర్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు సాగింది. ఆమె గిరిజన మహిళ.. ఉన్నత శిఖరాలకు చేరుకుంది.
ఇదీ నేపథ్యం..
ద్రౌపది
ముర్ము
ఒడిశాలోని
మయూర్భంజ్
జిల్లాకు
చెందిన
బైదాపోసి
గ్రామంలో
గిరిజన
జాతికి
చెందిన
సంతాల్
కుటుంబంలో
1958
జూన్
20
న
జన్మించారు.
ఆమె
తండ్రి
బిరంచి
నారాయణ్
తుడు.
తాతలు
పంజాయితీరాజ్
వ్యవస్థలోని
గ్రామాధికార్లుగా
ఉండేవారు.
గ్రాడ్యుయేషన్
తర్వాత
ఒడిశా
ప్రభుత్వంలో
సచివాలయంలో
క్లరికల్
పోస్ట్లో
ముర్ము
చేరారు.
రాయంగ్పూర్లోని
స్టేట్
బ్యాంక్
ఆఫ్
ఇండియా
బ్రాంచ్లో
పనిచేసే
శ్యామ్
చరణ్
ముర్ముని
పెళ్లి
చేసుకుంది.
వీరికి
ఇద్దరు
కుమారులు,
ఓ
కూతురు
ఉంది.
అయితే
ఇద్దరు
కుమారులు
చనిపోయారు.
భర్త
శ్యామ్
చరణ్
2014లో
మరణించారు.
రాజకీయాల్లోకి..
తర్వాత
ద్రౌపది
ముర్ము
రాజకీయాల్లోకి
వచ్చారు.
1997లో
భారతీయ
జనతా
పార్టీ
ద్వారా
రాజకీయాల్లోకి
వచ్చారు.
రాయ్రంగపూర్
నగర
పంచాయితీ
కౌన్సిలర్గా
ఎన్నికయ్యారు.
భారతీయ
జనతా
పార్టీ
కి
చెందిన
గిరిజన
తెగల
మోర్చాకు
ఉపాధ్యక్షురాలిగా
పనిచేశారు.
తర్వాత
2000వ
జరిగిన
ఒడిశా
శాసనసభ
ఎన్నికల్లో
రాయరంగపూర్
నియోజకవర్గం
నుండి
బీజేపీ
అభ్యర్థిగా
పోటీ
చేసి
గెలిచి
ఎమ్మెల్యేగా
ఎన్నికయ్యారు.
జూ
జనతాదళ్
సంకీర్ణ
ప్రభుత్వంలో
2000
మార్చి
6
నుండి
2002
వరకు
వాణిజ్యం,
రవాణాకు
స్వతంత్ర
బాధ్యతలు
నిర్వహించారు.
గవర్నర్ టు రాష్ట్రపతి
ద్రౌపది
ముర్ము
2004
లో
జరిగిన
ఒడిశా
శాసనసభ
ఎన్నికల్లో
రాయరంగ్పూర్
అసెంబ్లీ
నియోజకవర్గం
నుండి
రెండవసారి
ఎమ్మెల్యేగా
ఎన్నికయ్యారు.
2002
నుంచి
2009
వరకు
మయూర్
భంజ్
జిల్లా
బీజేపీ
అధ్యక్షురాలిగా,
2006
నుంచి
2009
వరకు
ఒడిశా
ఎస్టీ
మోర్చా
అధ్యక్షురాలిగా,
2010లో
మయూర్
భంజ్
జిల్లా
అధ్యక్షురాలిగా,
2013
నుంచి
2015
వరకు
మయూర్
భంజ్
జిల్లా
అధ్యక్షురాలిగా,
బీజేపీ
ఒడిస్సా
ఎస్టీ
మోర్చా
ఉపాధ్యక్షురాలిగా,
బీజేపీ
ఎస్టీ
మోర్చా
జాతీయ
కార్యవర్గ
సభ్యురాలిగా
వివిధ
హోదాల్లో
పని
చేశారు.
ద్రౌపది
ముర్ముకు
2007లో
ఒడిశా
శాసనసభ
ఉత్తమ
శాసనసభ్యురాలిగా
నికంఠ
పురస్కారాన్ని
అందించింది.
ద్రౌపది
ముర్ము
జార్ఖండ్
మొదటి
మహిళా
గవర్నర్గా
పనిచేశారు.
ఇప్పుడు
రాష్ట్రపతి
పదవీ
అధిరోహించబోతున్నారు.