వాజ్పేయిని కలిసిన ప్రధాని మోడీ, శుభాకాంక్షలు తెలిపిన బాబు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్పేయిని ఈ ఉదయం ప్రధాని నరేంద్రమోడీ కలిశారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గురవారం నాడు వాజ్పేయి తన 90వ పుట్టినరోజుని జరుపుకుంటున్నారు.
ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీకి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు వాజ్పేయిని కలసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వాజ్పేయి పుట్టిన రోజుని సుపరిపాలనా దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం పెద్ద నివాళి అని ప్రధాని మోడీ అన్నారు.
श्रद्धेय अटल जी को उनके जन्मदिवस के शुभ अवसर पर ढ़ेरों शुभकामनायें। Warm birthday wishes to our one & only Atal ji. http://t.co/T8rC1Aps0q
— Narendra Modi (@narendramodi) December 25, 2014 There is no bigger tribute to Atal ji than celebrating his birthday as 'Good Governance Day' & pledging to devote ourselves to this cause.
— Narendra Modi (@narendramodi) December 25, 2014 
మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్పేయి పుట్టినరోజు పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు. 1998- 2004 మధ్య దేశ ప్రధానిగా మూడుసార్లు బాధ్యతలు చేపట్టిన ఆయన, అత్యధికకాలం ఆ పదవిలో ఉన్న కాంగ్రెస్సేతర వ్యక్తిగా రికార్డు సృష్టించారు. మహోన్నత వ్యక్తిత్వంతో దేశ రాజకీయాల్లో ఆయన అజాత శత్రువన్న పేరు సంపాదించుకున్నారు.
భారతీయ జనతా పార్టీ నుంచి ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తి కూడా అటల్ జీ మాత్రమే కావడం విశేషం. వాజ్పేయి పుట్టినరోజుని సుపరిపాలనా దినోత్సవంగా జరుపుకోవాలని డిసెబంర్ 2న ప్రధాని మోడీ ప్రకటించారు.
ఇక ప్రస్తుతం మాజీ ప్రధాని వాజ్పేయి తీవ్ర అనారోగ్యంతో మంచం పట్టారు. దాదాపు ఐదేళ్లుగా వాజ్పేయి అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన ప్రధానిగా ఉండగానే మధ్యమధ్యలో మతిమరుపుతో ఏవో ఆలోచనల్లోకి వెళ్లేవారు.
వాజ్పేయి ప్రస్తుతం మంచం మీద నుంచి లేవగలిగే స్థితిలో లేరు. ఎవరైనా సందర్శకులు వస్తే... యంత్రాల సహాయంతో మంచాన్ని ఆయన కూర్చునే స్థితిలోకి మారుస్తున్నారు. ఇటీవల అద్వానీ అక్కడికి వెళ్లి వాజపేయిని కదిలించే ప్రయత్నం చేశారు.
‘అటల్జీ అద్వానీ వచ్చారు' అని చాలాసేపు చెప్పిన మీదట వాజ్పేయి క్షణంపాటు కళ్లు తెరిచి, మళ్లీ మూసుకుని నిద్రావస్థలో జారిపోయారు. మంగళవారం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సందర్శించినప్పుడూ వాజపేయి అలాగే కనిపించారు. వాజపేయితో పాటు ఆయన పెంపుడు కూతురు నమిత, అల్లుడు రంజన్ భట్టాచార్య మాత్రమే ఆయన పక్కన ఉండి సపర్యలు చేస్తున్నారు.
వాజ్పేయి తన జీవితంలో సాధించిన అరుదైన ఘట్టాలు
1951: జనసంఘ్ సంస్థాపక సభ్యుడు
1957: తొలిసారి లోక్సభకు ఎంపిక
1962: రాజ్యసభ సభకు ఎంపిక
1967: లోక్సభకు రెండోసారి ఎన్నిక
1968: జనసంఘ్ అధ్యక్షుడిగా..
1971: లోక్సభకుమూడోసారి ఎన్నిక
1977: లోక్సభకు నాల్గవసారి ఎన్నిక
1977: కేంద్ర విదేశాంగమంత్రి
1977: జనతాపార్టీ వ్యవస్థాపక సభ్యుడు
1980: లోక్సభకు 5వసారి ఎన్నిక
1980: బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు
1986: రాజ్యసభకు ఎంపిక.
1991: లోక్సభకు ఆరోసారి ఎన్నిక
1994: ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు
1996: లోక్సభకు 7వసారి ఎన్నిక
1996: ప్రధానిగా తొలిసారిప్రమాణం
96-97: లోక్సభలో ప్రతిపక్ష నేత
1998: ప్రధానిగా రెండోసారి ప్రమాణం
1999: 9వ సారి లోక్సభకు..ప్రధానిగా మూడోసారి ప్రమాణం
2004: లోక్సభకు
తిరిగిఎంపిక (10వసారి)
2005: రాజకీయాలకు స్వస్తి
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications