మోకాళ్లపై వంగి క్షమించమని అడిగిన నరేంద్రమోడీ
రాజస్థాన్లో జరిగిన బీజేపీ బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆలస్యంగా వచ్చారు. ఈ కారణంగా ప్రసంగించలేకపోతున్నందుకు ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. ఆయన మైక్ తీసి పక్కన పెట్టారు. నిబంధనలకు అనుగుణంగా ప్రధానమంత్రి వ్యవహరించిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
శిరోహిలోని అబూ రోడ్డులో నిర్వహించిన ర్యాలీలో నరేంద్రమోడీ ప్రసంగించాల్సి ఉంది. తాను ప్రసంగించాల్సిన సమయానికి కంటే ఆలస్యంగా అక్కడికి చేరుకున్నారు. ''తాను ఇక్కడకు రావడం ఆలస్యమైందని, రాత్రి పదిగంటలవుతోందని, నిబంధనలు పాటించాలంటూ నా మనస్సాక్షి చెబుతోందన్నారు''. ''తనను ప్రజలు క్షమించాలని, మీ ప్రేమాభిమానాల కోసం మళ్లీ ఇక్కడికి వస్తానంటూ'' మాటిచ్చారు. సభ నుంచి వెళ్లేముందు 'భారత్ మాతాకీ జై' అని నినదించడంతోపాటు మోకాళ్ల మీద వంగి సభికులందరికీ నమస్కరించారు.
బీజేపీ నేత మాలవీయ ట్విటర్లో దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. సమయం దాటడంతో బహిరంగసభలో మాట్లాడకూడదని, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని మోడీ నిర్ణయించుకున్నారు. అప్పటికే అది ఏడో కార్యక్రమమని, మోడీకి 72 సంవత్సరాల వయసు అనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలన్నారు. అంతే కాకుండా నవరాత్రి ఉపవాసం చేస్తున్నారని మాలవీయ తెలిపారు.
PM Modi decided against addressing the public meeting at Abu Road because it was well past stipulated time.
— Amit Malviya (@amitmalviya) September 30, 2022
This was 7th program of the day. Earlier he flagged and took a ride on Vande Bharat and Ahemdabad Metro, prayed at Ambaji among others.
He is 72 and fasting for Navratri! pic.twitter.com/UWiotbehQm
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్లో పర్యటించి రాజస్థాన్కు వచ్చారు. గుజరాత్తో సరిహద్దు పంచుకుంటున్న దక్షిణ రాజస్థాన్లో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ఈ ర్యాలీని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పాలనలో ఉన్న రాజస్థాన్ అసెంబ్లీకి 2023లో ఎన్నికలు జరగనున్నాయి.