కారు బోల్తా: ప్రధాని మోడీ సతీమణి జశోదాబెన్కు గాయాలు
జైపూర్: బుధవారం ఉదయం జరిగిన కారు ప్రమాదంలో ప్రధాని నరేంద్ర మోడీ సతీమణి జశోదాబెన్కు గాయాలయ్యాయి. రాజస్థాన్లోని కోటా-చిత్తోర్ రహదారిపై ఆమె కారులో ప్రయాణిస్తుండగా వాహనం బోల్తాపడినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.
The car in which PM Modi's wife, Jashodaben was travelling met with an accident on highway in Rajasthan's Chittorgarh. Her condition is fine, she was taken to the hospital for medical check up. pic.twitter.com/MtswTT1pUH
— ANI (@ANI) February 7, 2018
వెంటనే జశోదాబెన్ను చిత్తోర్గఢ్లోని ఆస్పత్రికి తరలించారు. కోటాలో ఓ వివాహ వేడుకలో పాల్గొని తిరిగి గుజరాత్ వస్తున్న సమయంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. కాగా, ఈ ప్రమాద ఘటనలో ఓ వ్యక్తి మరణించినట్లు తెలిసింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
కాగా, మెహసన జిల్లా ఉనిజా పట్టణంలోని తన సోదరుడు అశోక్ మోడీతోపాటు జశోదాబెన్ నివాసం ఉంటోంది. ప్రధాని మోడీ సతీమణి కావడంతో జిల్లా పోలీసులు ఆమె భద్రత ఏర్పాట్లు చూసుకుంటున్నారు.