నాడు పాదపూజలు ఎందుకు, ఇద్దరి చరిత్ర తెలియని వారెందరో, పీఠం కోసమేనా?
తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ ఇద్దరూ ఇద్దరేనని పిఎంకె వ్యవస్థాపకుడు డాక్టర్ రాందాస్ ఆరోపించారు.
చెన్నై:తమిళనాడు రాష్ట్ర అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం , అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ ఇద్దరూ ఒక్క తాను ముక్కలేనని పిఎంకె వ్యవస్థాపకుడు డాక్టర్ రాందాస్ ఆరోపించారు.అన్నాడిఎంకె పార్టీలో ఏర్పడిన అంతర్గత సంక్షోభం కారణంగా రాష్ట్రంలో పాలన పూర్తిగా స్థంబించిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ మేరకు ఆయన ఓ పత్రిక ప్రకటన విడుదలచేశారు. అధికార పోటీ రసవత్తరంగా సాగుతోందన్నారు. నిన్నటివరకు చిన్నమ్మకు వంగి వంగి దండాలు పెట్టి పాదపూజలు చేసిన నేత కంటికి ప్రస్తుతం అదే మహిళ దోపిడి దారుగా ఎలా కన్పిస్తోందని ఆయన ప్రశ్నించారు.

అధికారం కోసం పోటీపడుతున్న ఇద్దరి నేతల గత చరిత్ర తెలియని కార్యకర్తలు అనేక మంది ఉన్నారని, ఇదే సమయంలో రాష్ట్రంలో అనేక మంది మంచి నేతలు ఉన్నారనే విషయాన్ని ఓటర్లు గ్రహించకపోవడం తనను ఆవేదనకు గురి చేస్తోందన్నారాయన.
శశికళను, పన్నీర్ సెల్వాన్ని త్రాసులో కూర్చోబెట్టి తూకం వేస్తే ఇద్దరు సమానంగా ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ పరిస్థితుల్లో ఎవరు మంచివారో చెడ్డవారో బేరీజు వేయడం కంటే, వారి సిద్దాంతాలు, నైజాన్ని పోల్చుకొని ఒక అంచనాకు రావాలని ఆయన ప్రజలను కోరారు.
-
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు












Click it and Unblock the Notifications