పీఎన్బీ స్కాం: 31 బ్యాంకులకు మరో రూ. 5,280కోట్లు చెల్లించని ‘గీతాంజలి’
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాంలో మరో సంచలన విషయం వెలుగు చూసింది. పీఎన్బీ స్కాంలో రూ.11,400కోట్ల మేర రుణాలను ఎగ్గొట్టి ప్రముఖ నగల వ్యాపారులు నీరవ్ మోడీ, మెహుల్ ఛోక్సీలు దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే.
కాగా, ఛోక్సీకి చెందిన గీతాంజలి గ్రూప్ మరో రూ.5,280 కోట్ల రుణాలను ఎగ్గొట్టిందన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. గీతాంజలి జువెల్లరీకి 31 బ్యాంకులకు జరిగిన లావాదేవీలకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను, ఒప్పందాలను దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి.

రూ.5,280కోట్లను వర్కింగ్ కేపిటల్ ఫెసిలిటీగా గీతాంజలి సంస్థకు ఆ 31బ్యాంకులు అందించగా.. ఇప్పటి వరకూ ఆ రుణాన్ని తిరిగి చెల్లించలేదని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. ఈ లోన్ను అక్టోబర్ 2016లో ఇవ్వగా, అక్టోబర్ 2017లో పూర్తి చెల్లింపుతో అగ్రిమెంటు చేసుకున్నాయి బ్యాంకులు.
ఈ రుణాలు అందించిన బ్యాంకుల్లో పీఎన్బీ(రూ.587కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్(రూ.405కోట్లు), కార్పొరేషన్ బ్యాంక్(రూ.297కోట్ల) పెద్ద మొత్తాలను అందించాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. అయితే, ఈ మొత్తాలను బ్యాంకులు తిరిగి పొందడం కష్టమైన విషయమేనని తెలుస్తోంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications