వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైలు మరుగుదొడ్లో రద్దు చేసిన నాలుగున్నర లక్షల నగదు

రైలు మరుగుదొడ్డిలో రద్దుచేసిన నాలుగున్నర లక్షల నగుదను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. భువనేశ్వర్ డిల్లీ రాజధాని రైల్లులోని మరుగుదొడ్డిలో ఈ నగదును పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్ :రద్దుచేసిన నగదును మార్పిడి చేసుకొనేందుకు కొందరు ఇబ్బందులు పడుతోంటే , నల్లధనం ఉన్నవారు మాత్రం ఈ డబ్బును వదిలించుకొనేందుకు నానాతంటాలు పడుతున్నారు. ఏ రకంగా ఈ ధనాన్ని వదిలించుకోవాలనే విషయమై ఆలోచిస్తున్నారు. చెత్తకుప్పలు, నదుల్లో పారేసిన ఘటనలే కాకుండా రైలు మరుగుదొడ్లలో కూడ రద్దుచేసిన నగదును వదిలివెళ్ళిన ఘటన ఓకటి వెలుగు చూసింది.

డిల్లీ - భువనేశ్వర్ రాజధాని ఎక్స్ ప్రెస్ టాయి లెట్ లో పెద్ద మొత్తంలో నగదు దొరికింది.రద్దుచేసిన ఐదువందలు, వెయ్యి రూపాయల నగదు సుమారు నాలుగున్నర లక్షలను రైల్వే పోలీసులు గుర్తించారు. ఈ నగదును వదిలించుకోవాలనే ఉద్దేశ్యంతోనే గుర్తుతెలియని వ్యక్తులు ఇక్కడ వదిలేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

police seize 4.5 lakhs of banned currency in rail toilet

ఈ నగదును ఆదాయపుపన్ను శాఖాధికారులకు అప్పగించారు రైల్వే పోలీసులు. మరుగుదొడ్డిలో నాలుగున్నర లక్షల నగదును స్వాధీనం చేసుకొన్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఈ నగదును మరుగుదొడ్లో గుర్తించకముందే ముగ్గురు అనుమానితులు మరుగుదొడ్డి నుండి బయటకు వచ్చిన విషయాన్ని ప్రయాణీకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం ఆధారంగా ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొననారు. ఈ నగదు వారిదేనా, ఎక్కడి నుండి వచ్చిందనే విషయాలపై ఆరా తీస్తున్నారు.

English summary
4.5 lakhs banned currency identify in rail toilet . railway police seized 4.5 lakhs banned currency recently bhuvaneshwar- delhi train toilet.police arrest three people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X