పోలీసు గస్తీ బృందంపై ఉగ్రదాడి.. కానిస్టేబుల్ వీరమరణం
ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో ఒక బస్టాండ్ వద్ద పోలీసు గస్తీ బృందంపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక పోలీసు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
శ్రీనగర్: ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో ఒక బస్టాండ్ వద్ద పోలీసు గస్తీ బృందంపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇంతియాజ్ అహ్మద్ అనే పోలీసు కానిస్టేబుల్ మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
గస్తీ బాధ్యతలు నిర్వహిస్తున్న పోలీసు వాహనంపై ఉగ్రవాదులు 20 నుంచి 25 రౌండ్లు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. వెంటనే తేరుకున్న పోలీసు బృందం కూడా ఎదురు కాల్పులకు దిగింది. సమాచారం అందిన వెంటనే సీఆర్పీఎఫ్ బలగాలు ఆ ప్రదేశానికి చేరుకున్నాయి.

ప్రస్తుతం ఆ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలు ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నాయి. కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం కశ్మీర్లో పర్యటిస్తుండటం, ఆదివారం రాజ్నాథ్ పాల్గొనబోయే సమావేశ మందిరానికి సరిగ్గా 500 గజాల దూరంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం సంచలనం సృష్టించింది.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications