ప్రశాంతంగా పోలింగ్, యూపీలో 54 శాతం.. ఉత్తరాఖండ్ లో 40 శాతం
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు యూపీలో 54 శాతం.. ఉత్తరాఖండ్ లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40 శాతం పోలింగ్ నమోదైంది.
ఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఏడు విడతలుగా యూపీలో ఎన్నికలు నిర్వహిస్తుండగా 67 స్థనాలకు రెండో విడత పోలింగ్ బుధవారం జరుగుతోంది.
మధ్యాహ్నం మూడు గంటల వరకు యూపీలో 54.27 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 11 జిల్లాల్లో ఈ రోజు జరుగుతున్న పోలింగ్ లో 720 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. యూపీలోని మొరాదాబాద్ సమస్యాత్మక ప్రాంతం కావడం వల్ల ఇక్కడ భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు.

ఇక ఉత్తరాఖండ్ లో 69 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, ఒక స్థానంలో అభ్యర్థి మరణించడంతో అక్కడ పోలింగ్ వాయిదా పడింది. ఉత్తరాఖండ్ ఎన్నికల్లో మొత్తం 628 మంది అభ్యర్థుల పోటీపడుతున్నారు.
ఇక్కడ జరుగుతున్న పోలింగ్ లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40 శాతం ఓటింగ్ నమోదైంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి హరీశ్ రావత్ డెహ్రాడూన్ లోని ధర్మపూర్ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications