పోర్నోగ్రఫీ కేసు.. రాజ్ కుంద్రా తనను అరెస్ట్ చెయ్యకుండా పోలీసులకు భారీ లంచం ఇచ్చారని ఏసీబీకి మెయిల్
బాలీవుడ్ ని షేక్ చేస్తున్న రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో తనను అరెస్టు చేసేందుకు వచ్చిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు అరెస్టు నుండి తప్పించుకోవడానికి రాజ్ కుంద్రా రూ.25 లక్షలు లంచంగా ఇచ్చారని ఆరోపణలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
రాజ్ కుంద్రా లంచం ఇచ్చిన వ్యవహారాన్ని, ముంబై క్రైం పోలీసుల తీరును ఇదే కేసులో నిందితుడిగా ఉన్న అరవింద్ శ్రీవాస్తవ అలియాస్ యష్ ఠాకూర్ ఒక ఇమెయిల్ ద్వారా అవినీతి నిరోధక బ్యూరో కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. హాట్ షాట్ యాప్ వేదికగా రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల దందా చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా ఆయనను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. అయితే గతంలో మార్చిలో ఈ రాకెట్ పై కేసు నమోదు అయిన సమయంలో రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా ఆయన వారికి 25 లక్షల రూపాయల లంచం ఇచ్చినట్లుగా, ఈ కేసులో మరో నిందితుడు అరవింద శ్రీవాస్తవ ఆరోపించారు.
Recommended Video

తనను కూడా అరెస్టు చేయకుండా ఉండటం కోసం రాజ్ కుంద్రా తరహాలో లంచం ఇవ్వాల్సిందిగా పోలీసులు డిమాండ్ చేశారని, ఇరవై ఐదు లక్షల రూపాయలను ఇవ్వాలని కోరారని ఆయన ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. మార్చి నెలలో అరవింద శ్రీవాస్తవ చేసిన ఫిర్యాదును ఏప్రిల్లో ముంబై పోలీసు చీఫ్ కార్యాలయానికి పంపింది. అయితే నగర అధికారులు దీనిపై స్పందించడానికి నిరాకరించారు.అమెరికాకు చెందిన ప్లిజ్ మూవీ సంస్థకు సీఈవోగా ఉన్న అరవింద శ్రీవాస్తవ కూడా ఈ రాకెట్ లో ఉన్న కారణంగా ఆయనపై కూడా కేసు నమోదు అయింది. ఇక ఏసీబీకి చేసిన ఈమెయిల్లో రాజ్ కుంద్రా లంచం ఇచ్చిన వ్యవహారంతో పాటు అనేక విషయాలపై సుదీర్ఘ లేఖ రాసినట్లుగా సమాచారం. ఇక ఈ వ్యవహారంలో మరిన్ని విషయాలు బయటకు రావాల్సి ఉంది.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications