తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి జాగ్రత్తగా..: నారీమన్
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన బిల్లు తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి రాజ్యాంగ నిపుణులు పాలి నారిమన్ సూచించారు. శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. శాసనసభ తిరస్కరించిన బిల్లును రాష్ట్రపతి న్యాయసమీక్షకు పంపడం మంచిదని అభిప్రాయపడ్డారు.
శాసనసభ అధికారాలపై సుప్రీం కోర్టులో స్పష్టత తీసుకున్న తర్వాతే ముందుకెళ్లడం మంచిదని, ఎస్.ఆర్.బొమ్మై కేసులో శాసనసభకే అధికారాలని సుప్రీం తీర్పు చెప్పిందని ఆయన అన్నారు. ఫెడరల్ వ్యవస్థ వ్యవహారం కాబట్టి తెలంగాణ బిల్లుపై జాగ్రత్తగా అడుగులు వేయాలని ఆయన అన్నారు.

ఎస్ఆర్ బొమ్మై కోసుతో పాటు బాబూలాల్ పరాటే కేసు కూడా మన ముందు ఉందని, ఇందులో దేన్ని ప్రామాణికంగా తీసుకుంటారనేది చూడాలని ఆయన అన్నారు. తెలంగాణ బిల్లు విషయంలో రాష్ట్రపతి వద్ద రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని ఆయన చెప్పారు.
సుప్రీంకోర్టు సలహా తీసుకోవడం ఒక ప్రత్యామ్నాయం కాగా, నేరుగా మంత్రి వర్గానికి బిల్లును పంపించడం రెండో ప్రత్యామ్నాయమని ఆయన అన్నారు. ఇప్పుడు గానీ తర్వాత గానీ తెలగాణ బిల్లుపై సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చునని ఆయన అన్నారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications