ఆశ్రమంలో అక్కా చెల్లెల్ని బంధించి రేప్ చేశాడు: అరెస్ట్
హర్యానా: జింద్ జిల్లాలోని ఇగ్రాహ్ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు అమ్మాయిలను ఆశ్రమంలో బంధించిన ఓ ఆధ్యాత్మిక గురువు సోదరుడు వారిలో ఒకరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
బాధితురాలి కథనం ప్రకారం.. ఏప్రిల్ 10న ఉద్యోగం కోసం బాధితురాలితోపాటు ఆమె సోదరి వారణాసికి చేరుకున్నారు. అక్కడే గౌరిశంకర్ అనే వ్యక్తిని వీరిద్దరూ కలిశారు. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి అతడు వారిద్దరిని ఏప్రిల్ 11న తన సోదరుడు, ఆధ్యాత్మిక గురువు మనిశానంద్ ఆశ్రమానికి తీసుకెళ్లాడు.
ఆ తర్వాత వారిద్దరిని ఓ గదిలో బంధించి.. ఓ యువతిపై నిందితుడు గౌరిశంకర్ అత్యాచారానికి పాల్పడాడు. మూడు రోజులపాటు నిందితుడు ఆ యువతిపై అఘాయిత్యాన్ని కొనసాగించాడు. నిరాకరిస్తే వారిని చితక్కొట్టారు. ఈ విషయం బయటికి చెబితే ఇద్దరినీ చంపేస్తామని బెదిరింపులకు గురిచేశారు.
నిందితుడు అలహాబాద్ వెళ్లిన నేపథ్యంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు అక్కడ్నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, అలహాబాద్లో నిందితుడు గౌరిశంకర్ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరికొందరినీ కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.