వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరుణ్ జైట్లీ ఇంటికి వెళ్లిన ప్రధాని నరేంద్రమోడీ, చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు

|
Google Oneindia TeluguNews

ప్రధాని నరేంద్ర మోడీ ,ఇటివల మృతిచెందిన బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్టీ ఇంటికి వెళ్లి అయన కుటుంభసభ్యులను పరామర్శించారు. అనంతరం అరుణ్ జైట్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అరుణ్ జైట్లి మృతి చెందిన సమయంలో మోడీ జీ7 దేశాల సదస్సులో భాగంగా ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. విదేశీ పర్యటన ముగించుకుని రాత్రీ డిల్లీకి చేరుకున్నారు.

నేడు ఉదయమే జైట్లి ఇంటికి చేరుకున్న ప్రధాని నరేంద్రమోడి జైట్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంభసభ్యులను పరామర్శించారు. కాగా గత కోంతకాలంగా అనారోగ్యంతో డిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న అరుణ్ జైట్లి గత శనివారం మధ్యహ్నాం మృతి చెందారు.

Prime Minister Narendra Modi pay tributes to Arun Jaitley at house,

అయితే విషయం తెలుసుకున్న ప్రధాని తిరిగి దేశానికి వచ్చేందుకు సిద్దమయ్యారు. ఈ సంధర్భంలోనే మోడీ జైట్లి కుటుంభ సభ్యులకు ఫోన్ చేశారు. దీంతో వారు విదేశీ పర్యటన ముగించుకున్న తర్వాతే ఇండియాకు తిరిగి రావాలని అరుణ్ జైట్లీ భార్య ఫోన్లో సూచించింది. దీంతో ఆయన ఇండియాకు తిరిగి రాకుండా అక్కడే అరుణ్ జైట్లికి నివాళులు అర్పించారు. అనంతరం తాను విలువైన మిత్రుడిని కోల్పోయానని పేర్కోన్నారు. ప్రధానితో పాటు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా వెంట ఉన్నారు.

English summary
Prime Minister Narendra Modi drove down to former union minister Arun Jaitley’s house on Tuesday morning to pay tributes to the BJP stalwart who had been his friend for decades.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X