రాజీలేదు: సైనికులతో ప్రధాని మోడీ దీపావళి వేడుకలు
ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరంలానే ఈసారి కూడా సైనికులతో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ అక్కడి కచ్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సరిహద్దు భద్రతా దళం, ఆర్మీ, నేవీ, వాయుసేన సిబ్బందితో వేడుకలు చేసుకున్నారు. కచ్లోని సర్ క్రిక్ ప్రాంతంలో గల లక్కీ నాలాకు మోడీ బోటులో చేరుకున్నారు.
సైనిక దుస్తుల్లో వెళ్లిన మోడీ.. భద్రతా సిబ్బందికి మిఠాయిలు తినిపించి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్ తన శత్రువుల మాటలను కాదు.. సైనికుల దృఢ నిశ్చయాన్ని విశ్వసిస్తుందని ఈ సందర్బంగా ప్రధాని మోడీ అన్నారు. ప్రజలంతా సైనికుల వల్లే దేశం సురక్షితంగా ఉందని భావిస్తున్నారని తెలిపారు. భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అడుగులు వేస్తున్నామని.. ఈ కలలకు సైనికులే రక్షకులని అన్నారు.

సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడమే తమ ప్రథమ ప్రాధాన్యమని తెలిపారు. ఒక్క అంగుళం భూమి విషయంలోనూ రాజీ పడబోమని ప్రధాని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని సహించబోమంటూ పాకిస్థాన్కు గట్టి హెచ్చరికలు చేశారు. కాగా, ఈ భౌగోళిక ప్రాంతంలో విధులు నిర్వహించడం చాలా క్లిష్టతరమైనది. పగలు అత్యధిక వేడి, రాత్రుళ్లు అత్యధిక చలి ఉంటుంది. భూభాగం కూడా సవాలుతో కూడుకుని ఉంటుంది.
అంతకుముందు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని కేవడియాలోని ఐక్యతా విగ్రహాన్ని ప్రధాని మోడీ సందర్శించారు. పటేల్ విగ్రహానికి నివాళులర్పించి స్థానికులతో కలిసి ఐక్యాతా ప్రమాణం చేశారు. ఈ సందర్బంగా నిర్వహించిన జాతీయ ఐక్యతా దివస్ పరేడ్లో పాల్గొని సైనిక సిబ్బంది విన్యాసాలు, కళాకారుల ప్రదర్శనలను వీక్షించారు.
PM @narendramodi celebrated Diwali with BSF, Army, Navy and Air Force personnel at Lakki Nala in Sir Creek area in Kutch, Gujarat.
— DD News (@DDNewslive) October 31, 2024
This is an extremely inhospitable place, due to the very hot days and very cold nights. The terrain is also challenging.#Diwali2024 pic.twitter.com/Wi0AhfGY6C
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. దేశ ప్రగతికి అడ్డుగోడలా ఉందనే ఆర్టికల్ 370ని తొలగించామని తెలిపారు. ఉమ్మడి పౌరస్మృతి దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. స్థానిక భాషల అభివృద్ధికి కేంద్రం అండగా ఉంటుందన్నారు. దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు బయటి, లోపలి శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. వన్ నేషన్-వన్ ఎలక్షన్ దేశ వికాసానికి దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఏటా ఎన్నికల వల్ల దేశ ప్రగతి కుంటుపడుతోందని వ్యాఖ్యానించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ తో దేశ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.
#WATCH | On 'Rashtriya Ekta Diwas', Prime Minister Narendra Modi says "...We are now working towards One Nation One Election, which will strengthen India's democracy, give optimum outcome of India's resources and the country will gain new momentum in achieving the dream of a… pic.twitter.com/vUku6ZCnVv
— ANI (@ANI) October 31, 2024
కాగా, 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వచ్చిన నాటి నుంచి నరేంద్ర మోడీ ప్రతియేటా సైనికులతో కలిసి వేడుకలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. భద్రతా దళాలతో ముచ్చటించడంతోపాటు వారికి స్వీట్లు తినిపించి సరదాగా గడుపుతూ వారిలో స్ఫూర్తిని నింపుతున్నారు. 2014లో మోడీ తొలిసారి సియాచిన్లో సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్నారు. 2022లో కార్గిల్లో, గత సంవత్సరం చైనా సరిహద్దులోని లేప్చా సైనిక శిబిరంలో వేడుకలు జరుపుకున్నారు.
-
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications