ప్రియాంక గాంధీకి అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక: రాహుల్ యాత్రకు దూరమేనా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్లు ఆమె ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఉత్తరప్రదేశ్లో జరగబోయే భారత్ జోడో న్యాయ యాత్ర కోసం ఎంతగానో ఎదురుచూశా. కానీ, ఈరోజే అనారోగ్యం వల్ల ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. కోలుకున్న వెంటనే నేను యాత్రలో పాల్గొంటా అని ప్రియాంక పేర్కొన్నారు.
మణిపూర్ నుంచి ముంబై వరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో కొనసాగుతున్న రాహుల్ యాత్ర.. శుక్రవారం రాత్రికి ఉత్తరప్రదేశ్ చేరనుంది. ఉత్తరప్రదేశ్లో రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంక కూడా పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. అయితే, ఇప్పుడు ప్రియాంక అనారోగ్యానికి గురికావడంతో యాత్రలో పాల్గొనలేకపోతున్నట్లు వెల్లడించారు.

కాగా, శుక్రవారం నుంచి ఫిబ్రవరి 21 వరకు, ఆ తర్వాత 24, 25వ తేదీల్లో రాహుల్ యాత్ర యూపీలో కొనసాగనుంది. అయితే, ప్రియాంక గాంధీ ఈ తేదీల్లో ఏ రోజు రాహుల్ యాత్రలో పాల్గొంటారో ప్రస్తుతానికి స్పష్టత లేదు.
కాగా, వచ్చే లోక్సభ ఎన్నికల్లో యూపీ రాష్ట్రంలోని రాయ్బరేలీ నుంచి గాంధీ కుటుంబసభ్యులే పోటీ చేస్తారని సోనియా సూచన ప్రాయంగా చెప్పడంతో.. అక్కడ్నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.సోనియాం గాంధీ ఇప్పటికే రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications