కులభూషణ్ వ్యవహారంలో తీవ్ర నిరసన : పాక్ హై కమిషన్కు చెప్పులు పంపిన బీజేపీ నాయకుడు!
న్యూఢిల్లీ : భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ కుటుంబ సభ్యులతో పాకిస్తాన్ అమానుష ప్రవర్తనకు వ్యతిరేకంగా భారత్లో పెద్ద ఎత్తున్న నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నిరసనలో భాగంగా ఢిల్లీ బీజేపీ లీడరు.. పాకిస్తాన్ హై కమిషన్కు ఆన్లైన్లో చెప్పులను డెలివరీ చేశారు. కులభూషణ్ తల్లి, భార్యతో వ్యవహరించిన తీరు పట్ల నిరసన వ్యక్తంచేస్తూ ఆయన ఈ చెప్పులను డెలివరీ చేసినట్టు పేర్కొన్నారు.

కులభూషణ్ను చూసేందుకు వెళ్లిన అతడి తల్లి, భార్య కుంకుమ, తాళిని పాక్ అధికారులు బలవంతంగా తీసేయించిన సంగతి తెలిసిందే. అది తెలియని జాదవ్ వారిని కలిసిన వెంటనే నాన్న బాగానే ఉన్నాడు కదా? అంటూ ప్రశ్నించారు.
కులభూషణ్ కుటుంబ సభ్యుల్ని పాకిస్తాన్ ప్రభుత్వం ఘోరంగా అవమానించిందని, ఆయన తల్లిని, భార్యను వితంతువులుగా మార్చేసిందని ఆవేదన వ్యక్తంచేస్తూ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఏకంగా పార్లమెంట్లోనే కన్నీరు పెట్టుకున్నారు.
ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి తాజిందర్ పాల్ సింగ్ బగ్గా, ఆన్లైన్లో చెప్పులను కొనుగోలు చేశారు. వాటి డెలివరీ కోసం పాకిస్తాన్ హై కమిషన్ అడ్రస్ ఇచ్చారు. ''పాకిస్తాన్కు మన చెప్పులు కావాలి. వారికి చెప్పులు పంపండి. నేను చెప్పులు ఆర్డర్ చేశా. పాకిస్తాన్ హై కమిషన్కు పంపాను..'' అని తాజిందర్ పాల్ సింగ్ ట్వీట్ చేశారు.
అంతేకాదు, పాకిస్తాన్కు చెప్పులు పంపండంటూ ఆన్లైన్ క్యాంపెయిన్ కూడా ఆయన ప్రారంభించారు. ఈ ఆన్లైన్ క్యాంపెయిన్ను ప్రారంభించిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ హై కమిషన్కు వందల మంది భారతీయులు తమ నిరసన తెలియజేస్తూ ఫుట్వేర్ పంపించారు.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్కు తాకట్టు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications