మోదీ మొండి వైఖరి -రైతుల ఆందోళన తీవ్రం -18న దేశవ్యాప్త రైల్ రోకో -ఆపై 40లక్షల ట్రాక్టర్లతో..
వ్యవసాయ రంగంలో సంస్కరణ పేరుతో కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ.. దేశ రాజధాని ఢిల్లీ శివారుల్లో వేలాది మంది రైతులు కొనసాగిస్తోన్న నిరసనలు బుధవారంతో 77 రోజులు పూర్తయ్యాయి. రిపబ్లిక్ డే నాటి హింస తర్వాత రైతు సంఘాలు, ప్రభుత్వం మధ్య చర్చల ప్రక్రియ కూడా నిలిచిపోయింది. ఓవైపు రైతుల్ని చర్చలకు ఆహ్వానించిన ప్రధాని మోదీ.. గడిచిన వారం మూడు రోజులుగా పార్లమెంటులో వరుస ప్రసంగాలు చేస్తూ రైతుల ఉద్యమంపై, దాని సమర్థకులపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ దశలో..
సాగు చట్టాలపై కేంద్రం అంతకంతకూ మొండివైఖరి ప్రదర్శిస్తుండటంతో రైతులు తమ ఉద్యమాన్ని ఇంకాస్త తీవ్రతరం చేయాలని నిర్ణయించుకున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన వచ్చే వారంలో మరింత ఉధృతం కానుంది. ఫిబ్రవరి 18న దేశవ్యాప్తంగా 4 గంటల పాటు రైల్రోకోకు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) బుధవారంనాడు పిలుపునిచ్చింది. ఆ రోజు..

దేశవ్యాప్తంగా రైల్ రోకో చేపట్టనున్న ఫిబ్రవరి 18న మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటలు వరకూ రైల్రోకో నిర్వహించనున్నట్టు రైతు ఆందోళనకు సారధ్యం వహిస్తున్న ఎస్కేఎం ఒక ప్రకటనలో తెలిపింది. ఆందోళన జరుపుతున్న రైతులు చర్చలు ప్రారంభించాలంటూ ప్రధాని మోదీ లోక్సభలో బుధవారంనాడు రెండోసారి విజ్ఞప్తి చేసిన కొద్ది గంటలకే ఎస్కేఎం ఈ పిలుపునివ్వడం గమనార్హం. కాగా,
40 లక్షల ట్రాక్టర్లతో దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తామని, రైతుల ఉద్యమాన్ని దేశ వ్యాపితం చేస్తామని రైతు సంఘాల నేత టికాయత్ హెచ్చరించగా, దేశ వ్యాప్త ఆందోళన అక్టోబర్ 2 వరకు కొనసాగుతుందని, చట్టాల ఉపసంహరణకు అక్టోబర్ 2వ తేదీ వరకూ ప్రభుత్వానికి గడువు ఇస్తున్నట్టు సంయుక్తంగా మరో ప్రకటన వెలువడింది. ఆ గడువులోగా చట్టాలు రద్దు చేయకుండే తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామని రైతు సంఘాలు హెచ్చరించాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications