కన్నీటి గాథ: చివరి వీడియోను తన భార్యకు పంపించిన అమర జవాను
జైషే మహ్మద్ ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై దాడి చేసిన ఘటనలో 40 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. అయితే బస్సులో బయలుదేరిన సీఆర్పీఎఫ్ జవాన్లలో ఒక జవాను చివరిసారిగా ఓ వీడియో తన భార్యకు పంపాడు. ఆ వీడియోను ఆమె బయటపెట్టి కన్నీరుమున్నీరు అయ్యింది.
పుల్వామా దాడుల్లో అమరులైన జవాన్లలో ఒకరు 76వ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ సుఖ్జీందర్ సింగ్. పంజాబ్లోని తర్న్ తరన్ ప్రాంతానికి చెందిన ఈ వీరజవాను తన భార్యకు చివరిసారిగా ఓ వీడియో పోస్టు చేశాడు. సీఆర్పీఎఫ్ బస్సులో ప్రయాణం చేస్తూ ఓ వీడియోను తన మొబైల్ ఫోనులో రికార్డు చేశాడు. ఆ తర్వాత కొన్ని క్షణాలకే ఆత్మాహుతి దాడిలో అమరుడయ్యాడు సుఖ్జీందర్ సింగ్. అయితే భర్త చనిపోయిన బాధలో ఆ భార్య ఇన్నిరోజులు ఆ వీడియో చూడలేదు. శుక్రవారం చూసి దాడి జరగక కొన్ని క్షణాల ముందే రికార్డు చేసిన వీడియో చూసి కంటతడి పెట్టింది.

సీఆర్పీఎఫ్ బస్సులో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న సమయంలో ఆ వీడియోను సుఖ్జీందర్ సింగ్ రికార్డు చేశాడు. ఆ వీడియోలో బస్సులోని ఇతర జవాన్లతో పాటు సుఖ్జీందర్ సింగ్ కూడా కనిపించాడు. బస్సును కూడా రికార్డు చేశాడు. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే బస్సుపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఇదే తన భార్యకు పంపిన చివరి వీడియో.ఇదిలా ఉంటే సుఖ్జీందర్ సింగ్కు తల్లిదండ్రులు, భార్య, ఏడునెలల బాలుడు ఉన్నారు. సీఆర్పీఎఫ్లో 2003లో చేరాడు. ఆసమయంలో ఆయనకు 19 ఏళ్లు. ఎనిమిది నెలల క్రితమే తను హెడ్ కానిస్టేబుల్గా ప్రమోట్ అయ్యాడు. ఈ వీడియోను చూసిన వారంత కంటతడి పెడుతున్నారు.
ఫిబ్రవరి 14న జరిగిన దాడితో అప్రమత్తమైన భారత సైన్యం వెంటనే ఈ దాడి సూత్రధారులను మట్టుబెట్టింది. ఇక పాకిస్తాన్పై ఆంక్షలు విధించాలంటూ భారత ప్రభుత్వం ప్రపంచదేశాలను కోరుతోంది. ఈ క్రమంలోనే పాక్పై ప్రపంచదేశాలు ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే ఘటనతో పాకిస్తాన్కు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. అయితే ప్రపంచ వేదికలపై పాకిస్తాన్ను ఒంటరిని చేసేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications