మటన్ కూర కోసం తండ్రి చేతిలో కొడుకు దారుణ హత్య.. తల్లి కూడా అరెస్ట్!

మహారాష్ట్రలోని పుణెలో ఓ దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రావణ మాసంలో మటన్ వండటం విషయంలో జరిగిన వివాదం ఓ యువకుడి ప్రాణాన్ని బలిగొంది. వార్జే-మల్వాడి ప్రాంతంలో 30 ఏళ్ల మహేష్ భగవాన్ గైక్వాడ్‌ను కొట్టి చంపినట్లు తెలిసింది ఈ నేరానికి పాల్పడింది మరెవరో కాదు.. మహేష్ తండ్రే. పోలీసులు నిందితులైన 64 ఏళ్ల తండ్రి భగవాన్ సూర్యభాన్ గైక్వాడ్‌ను, అతని 60 ఏళ్ల తల్లి పార్వతి భగవాన్ గైక్వాడ్‌ను అరెస్టు చేశారు.

పాలలో నిద్రమాత్రలు.. ప్రియుడితో కిలాడీ భార్య రాసలీలలు! పెళ్లయిన నెలన్నరకే భర్తకు నరకం!
పాలలో నిద్రమాత్రలు.. ప్రియుడితో కిలాడీ భార్య రాసలీలలు! పెళ్లయిన నెలన్నరకే భర్తకు నరకం!

అసలేం జరిగిందంటే?
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఘటన ఆగస్టు 25వ తేదీ రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల విచారణలో మహేష్‌కు పెళ్లై సుమారు 10 ఏళ్లయిందని.. అయితే అతను తాగుబోతు అని, ఏ పని చేయకుండా ఖాళీగా ఉన్నాడని తేలింది. అతని భార్య వారి ఇద్దరు పిల్లలతో కలిసి అతని నుంచి విడిపోయిందని.. ఇటీవలే వారికి విడాకులు కూడా అయ్యాయని తెలిసింది. ఆ తర్వాత మహేష్ ఒంటరిగా జీవిస్తూ, తరచుగా భోజనం చేయడానికి దగ్గర్లో ఉన్న తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేవాడు.

Pune Crime Son Killed by Father Over Mutton in Shravan Both Parents Have been Arrested by Police

ఆగస్టు 25వ తేదీ రాత్రి అతను మద్యం మత్తులో తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చినట్లు సమాచారం. ఇంటికి వచ్చిన తర్వాత మహేష్ తన తల్లిదండ్రులను మటన్ కూర వండమని అడిగాడు. అయితే, అది శ్రావణ మాసం కావడంతో ఆ సమయంలో వారి కుటుంబం మాంసాహారం వండేందుకు నిరాకరించింది. అతని తల్లిదండ్రులు మటన్ వండడానికి నిరాకరించడంతో, మహేష్‌కు, అతని తండ్రికి మధ్య వాగ్వాదం జరిగింది. వాగ్వాదం కాస్త శారీరక ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణ సమయంలో మహేష్ తండ్రి భగవాన్ సూర్యభాన్ గైక్వాడ్ అతని ముఖం, తలపై పదేపదే దాడి చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. తీవ్ర గాయాలపాలైన మహేష్ పరిస్థితి విషమించి మరణించాడు. ఘటనా స్థలంలో అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు.

వార్జే-మల్వాడి పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత మహేష్ తల్లి పార్వతి తన భర్తను కాపాడటానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సాక్ష్యాలను చెరిపివేయడానికి ఆమె నేరస్థలంలోని రక్తపు మరకలను శుభ్రం చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఆమె మహేష్ అన్నయ్యకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. పార్వతి ఒక నర్సింగ్ హోమ్‌లో నర్సుగా పనిచేస్తున్నారు. మహేష్ అన్నయ్య వృత్తిరీత్యా చిత్రకారుడు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న అతను వార్జే-మల్వాడి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం హత్య ఆరోపణలపై మహేష్ తండ్రిని, సాక్ష్యాలను ధ్వంసం చేసి భర్తకు సహకరించినందుకు అతని తల్లిని పోలీసులు అరెస్టు చేశారు.

కూతురితోనూ అలా.. ప్రియుడి మర్మాంగాన్ని కోసేసిన వివాహిత!
కూతురితోనూ అలా.. ప్రియుడి మర్మాంగాన్ని కోసేసిన వివాహిత!

శ్రావణ మాసంలో మటన్ వండాలన్న డిమాండ్, మాంసాహారం వండడానికి నిరాకరించడం వల్ల ఈ వివాదం మొదలైందని ప్రాథమిక పోలీసు విచారణలో వెల్లడైంది. కుటుంబంలో మొదలైన ఈ వాదన త్వరగా తీవ్రమై హింసాత్మక ఘర్షణకు దారితీసింది, ఫలితంగా 30 ఏళ్ల మహేష్ మరణించాడు. ప్రస్తుతం ఇద్దరు నిందితులను విచారిస్తున్నారు. పోలీసులు కేసులోని ఇతర అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+