14 ఏళ్ల పూర్ణ, 17 ఏళ్ల ఆనంద్ ఎవరెస్ట్ ఎక్కి రికార్డ్
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలుగు తేజం పూర్ణ ప్రపంచ రికార్డు సాధించింది. చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బాలికగా మాలావత్ పూర్ణ చరిత్ర సృష్టించారు. తెలుగు విద్యార్థులు ఆనంద్, పూర్ణ ఈ సాహసం చేశారు.
ఎవరెస్ట్ పర్వతంపై వీళ్లు జాతీయ జెండా ఎగురవేశారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా ఆనంద్ రికార్డులకెక్కాడు.

పద్నాలుగు ఏళ్ల పూర్ణ నిజామాబాద్ జిల్లా తాడ్వాయి గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. 17 ఏళ్ల ఆనంద్ ఖమ్మం జిల్లా గురుకులంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. వీరిద్దరూ గతేడాది నవంబర్లో డార్జిలింగ్లోని 17వేల అడుగుల ఎత్తున్న మౌంట్ రినాక్ శిఖరాన్ని ఎక్కి రికార్డు సృష్టించారు.
వీరి ప్రతిభను గుర్తిం చిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల సొసైటీ వీరికి భువనగిరిలోని రాక్ క్లైంబింగ్ స్కూల్లో ప్రత్యేక తర్ఫీదునిచ్చింది. వీరికి సొసైటీకి చైర్మన్గా ఉన్న ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ తనవంతు సహాయం అందించారు. మూడు నెలల తర్ఫీదు అనంతరం విద్యార్థులను ఎవరెస్ట్ అధిరోహణకు సిద్ధం చేశారు. వీరు ఎవరెస్ట్ ఎక్కి రికార్డ్ సృష్టించారు. ఈ విషయాన్ని ప్రవీణ్ కుమార్ మీడియాకు తెలిపారు.












Click it and Unblock the Notifications