అప్పుడే ప్రతీకారం: పన్నీర్ కు నోటీసులు జారీ, మర్యాదగా వెళ్లిపోండి !
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఎడప్పాడి పళనిసామి చిన్నమ్మ భక్తిని చాటుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్దం అయ్యారు.
శశికళ ప్లాన్ రివర్స్: జైల్లో మరో గదికి, తమిళనాడు వెళ్లాలని ! ఎందుకంటే ?
తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి చెన్నైలోని గ్రీన్ వేస్ రోడ్డులోని ప్రభుత్వ బంగ్లాలో నివాసం ఉంటున్నారు. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆయన అదే బంగ్లాలో ఉండేవారు.
తమిళనాడు ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తరువాత పన్నీర్ సెల్వం అదే బంగ్లా కేంద్రంగా శశికళ మీద తిరుగుబాటు చేశారు. తమిళనాడులోని వివిధ జిల్లాల నుంచి వస్తున్న జయలలిత అభిమానులు గ్రీన్ వేస్ రోడ్డులోని పన్నీర్ సెల్వం ఇంటికి చేరుకుని ఆయనకు మద్దతు ఇస్తున్నారు.
శశికళ WWE,జైల్లో ఫోటోలు వైరల్: సోషల్ మీడియాలో దేశంలోనే టాప్
గ్రీన్ వేస్ రోడ్డులోని ప్రభుత్వ బంగ్లా పన్నీర్ సెల్వం బాగా అచ్చోచ్చిందని అనుకున్నారో ? లేక ఆయన ఆ బంగ్లాలో ఉండటానికి అవకాశం ఇవ్వకుండా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నారో ? ఏమో శుక్రవారం తమిళనాడు ప్రభుత్వం ఆయనకు నోటీసులు ఇచ్చింది.
తమిళనాడు ప్రభుత్వానికి చెందిన పీడబ్ల్యూడీ శాఖ అధికారులు వెంటనే మీరు బంగ్లా ఖాళీ చెయ్యాలని పన్నీర్ సెల్వంకు నోటీసులు ఇచ్చారు. అయితే ఇంత ఆఘమేఘాల మీద ఆయన్ను బంగ్లా ఖాళీ చెయ్యమంటే ఏలా ? అంటూ పన్నీర్ సెల్వం మద్దతుదారులు తమిళనాడు ప్రభుత్వం మీద మండిపడుతున్నారు.