వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంపీ రఘురామకు భారీ షాక్: వైసీపీ అనర్హత ఫిర్యాదుపై లోక్‌సభ సెక్రటేరియట్ నోటీసులు -15 రోజుల్లోగా

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ఆయన పార్టీకే చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు మధ్య గత రెండేళ్లుగా కొనసాగుతోన్న యుద్ధం ముగింపు దశకు వచ్చింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామపై అనర్హతవేటు వేయాల్సిందిగా వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఎట్టకేలకు చర్యలకు దిగారు..

Recommended Video

CM Jagan VS Raghurama Krishnam Raju | Oneindia Telugu

అధినేత జగన్ ను పదే పదే ధిక్కరిస్తూ, పార్లమెంటులో పార్టీ లైన్ కు విరుద్దంగా వ్యవహరిస్తోన్న రఘుమపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని, అతణ్ని ఎంపీ పదవికి అనర్హుడిగా ప్రకటించాలని వైసీపీ దాదాపు రెండేళ్లుగా స్పీకర్ ఓం బిర్లాను అభ్యర్థిస్తూ రావడం తెలిసిందే. ఈ వ్యవహారంలో తొలిసారి రెబల్ ఎంపీకి నోటీసులు జారీ అయ్యాయి.

సీజేఐ వ్యాఖ్యల ఊతం, రెచ్చిపోయిన రఘురామ -సీఎం జగన్, సాయిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు -మహిళలతో అదోలాసీజేఐ వ్యాఖ్యల ఊతం, రెచ్చిపోయిన రఘురామ -సీఎం జగన్, సాయిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు -మహిళలతో అదోలా

raghu-rama-disqualification-lok-sabha-secretariat-issues-notices-to-ysrcp-rebel-mp

ఫిరాయింపుల చట్టం కింద వైసీపీ చేసిన ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలంటూ ఎంపీ రఘురామకు లోక్ సభ సెక్రటేరియట్ గురువారం నాడు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా ఈ షోకాజ్ నోటీసులకు ఎంపీ సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని లోక్ సభ సెక్రటేరియట్ పేర్కొంది. ఫిరాయింపు వ్యవహారంలో ఇరుపక్షాల వాదనలూ విన్న తర్వాతే నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ ఓం బిర్లా ఇటీవలే చెప్పిన విధంగా ఇప్పుడు లోక్ సభ సెక్రటేరియట్ ఎంపీ వివరణ కోరింది. కాగా,

అనర్హత వేటు వ్యవహారానికి సంబంధించి వైసీపీ రెబల్ రఘురామకృష్ణంరాజుతోపాటు బెంగాల్ కు చెందిన మరో ఇద్దరు ఎంపీలకు సైతం షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. బెంగాల్ ఎంపీలు శిశిర్ అధికారి, సునిల్ కుమార్ మండల్ టీఎంసీ నుంచి గెలుపొంది, ఆ తర్వాత బీజేపీలోకి ఫిరాయించారు. వీరిని అనర్హులుగా ప్రకటించాలన్న టీఎంసీ ఫిర్యాదు మేరకు ఇవాళ లోక్ సభ సెక్రటేరియట్ నోలీసులు జారీ చేసింది.

టార్గెట్ రఘురామ కాదు, కేసీఆర్ -జగనన్న కాలనీకి ప్రధాని మోదీ నిధుల సాధన -పార్లమెంట్‌లో వైసీపీ వ్యూహాలివేటార్గెట్ రఘురామ కాదు, కేసీఆర్ -జగనన్న కాలనీకి ప్రధాని మోదీ నిధుల సాధన -పార్లమెంట్‌లో వైసీపీ వ్యూహాలివే

English summary
after repeated requests from ysrcp, lok sabha speaker om birla now get in to action on disqualification of ysrcp rebel mp raghu rama krishnam raju. Lok Sabha Secretariat on thursday issues show cause letters to K Raghu Rama Krishna Raju in response to petition received under Anti-Defection Law. along with raghu rama MPs Shishir Adhikari, Sunil Kumar Mandal also gets notices. They have been asked to give their comments within 15 days of receipt of letters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X