Rahul Gandhi: మోడీని ట్రంప్ ఎలా భయపెట్టారంటే ? గుట్టు విప్పిన రాహుల్..!
భారత్- అమెరికా మధ్య తాజాగా హఠాత్తుగా కుదిరిన వాణిజ్య ఒప్పందంపై లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ (rahul gandhi) తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టి మరీ ఈ ఒప్పందం చేసుకున్నారంటూ ప్రధాని మోడీపై రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. ఇవాళ పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై రాహుల్ మాట్లాడకుండా బీజేపీ సభ్యులు తీవ్ర ఆటంకాలు సృష్టించారు. దీంతో సభ వాయిదా పడింది. అనంతరం బయటికి వచ్చిన రాహుల్ మాట్లాడారు.
ప్రధాని మోడీ భయపడుతున్నారని, అమెరికాతో వాణిజ్య ఒప్పందం నాలుగు నెలలుగా నిలిచిపోయి ఉందని, కానీ ఇవాళ ఎలాంటి కారణం లేకుండానే డీల్ జరిగిపోయిందన్నారు. మోడీ నిన్న సాయంత్రం ఈ డీల్ పై సంతకం చేశారని గుర్తుచేశారు. ఆయనపై తీవ్ర ఒత్తిడి ఉందన్నారు. మోడీకి ఇమేజ్ పోతుందనే భయం పట్టుకుందన్నారు. మాజీ ఆర్మీ ఛీఫ్ నరవణే పుస్తకంలో అంశాల పేరుతో తనను అడ్డుకున్నారని, కానీ ఇది అసలు విషయం కాదన్నారు.

PM Modi is Compromised.
— Rahul Gandhi (@RahulGandhi) February 3, 2026
PM is too afraid to let me speak in Parliament about Naravane, Epstein Files and how he has surrendered on Tariffs. pic.twitter.com/V1J6yxZDM2
ఇది ప్రజలు గమనించాలన్నారు. లోక్ సభలో విపక్ష నేతను రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు చెప్పకుండా తొలిసారి అడ్డుకున్నారన్నారు. ఈ వాణిజ్య ఒప్పందం ద్వారా మన దేశంలో రైతుల రక్తం, శ్రమను ప్రధాని మోడీ అమ్ముకున్నారన్నారు. వారితో పాటు దేశాన్ని కూడా అమ్మేశారన్నారు. మోడీ భయపడుతున్నారని, ఎందుకంటే ఆయనకు ఈ ఇమేజ్ తెచ్చినవారే దాన్ని చెడగొడుతున్నారన్నారు. అమెరికా ప్రభుత్వం అదానీనీ టార్గెట్ చేయడం లేదని, మోడీ ఆర్ధిక బలాన్ని టార్గెట్ చేస్తోందన్నారు. అలాగే ఎప్ స్టీన్ ఫైల్స్ ద్వారా మోడీని టార్గెట్ చేస్తున్నారన్నారు. ఎప్ స్టీన్ ఫైల్స్ ను అమెరికా ఇంకా విడుదల చేయలేదన్నారు. ఈ రెండు అంశాలు ప్రధాని మోడీ రాజీపడ్డారనే దానికి నిదర్శనం అన్నారు.
-
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
బీహార్ కు కొత్త సీఎం ఫిక్స్, నితీష్ కు కీలక పదవి..!? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!!












Click it and Unblock the Notifications