మోడీ జీ ఎందుకు మౌనం: రాహుల్ కౌంటర్
లక్నో: ఢిల్లీ క్రికెట్ కుంభకోణంలో తప్పు చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటి కైనా మౌనం వీడాలని సూచించారు.
అవినీతిని సహించమని పదేపదే చెప్పిన నరేంద్ర మోడీ ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని సూటిగా ప్రశ్నించారు. రెండు రోజుల పాటు అమేథిలో పర్యటించిన రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీ బయలుదేరే ముందు లక్నోలో విలేకరులతో మాట్లాడారు.
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ తాను అవినీతిని సహించబోనని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత అనేక కుంభకోణాలు వెలుగు చూసినా ఎందుకు పట్టించుకోవడం లేదని అన్నారు.

నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత అనేక కుంభకోణాలు తెరమీదకు వచ్చాయి, ఇప్పుడు తాజాగా క్రికెట్ స్కామ్ వెలుగు చూసింది అన్నారు. క్రికెట్ కుంభకోణం వెలుగులోకి తెచ్చిన మీ పార్టీ ఎంపీ కీర్తి ఆజాద్ ను సస్పెండ్ చెయ్యడం ఎంత వరకు న్యాయం అని ప్రశ్నించారు.
తాను అవినీతికి పాల్పడనని, అవినీతికి పాల్పడే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని పదేపదే చెప్పిన నరేంద్ర మోడీ ఇప్పుడు కనీసం ఆ విషయంపై నోరు విప్పడం లేదని విమర్శించారు. డీడీసీఏ నిధుల దుర్వినియోగం పై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications