లెక్కలు రావా: రాహుల్ గాంధీ ప్రశ్న రివర్స్, నెటిజన్ల సెటైర్లు
న్యూఢిల్లీ: అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ మరోసారి పొరపాటు చేశారు. ఆయన ట్విట్టర్లో చేసిన కామెంటుకు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
రాహుల్ గాంధీ స్ట్రాటేజీ టీం ఇదే: సచిన్ నుంచి రమ్య దాకా
పెరుగుతున్న నిత్యావసర సరకుల ధరల గురించి ప్రస్తావిస్తూ ఓ పొరపాటు చేశారు. మీకు లెక్కలు రావా అంటూ ఆయనపై నెటిజన్లు జోకులు పేల్చారు.
2014 నుంచి 2017 వరకు నిత్యవసర సరకుల ధరలు ఎంత శాతానికి పెరిగాయో ఓ టేబుల్ ద్వారా రాహుల్ వివరించారు. అప్పటికీ ఇప్పటికీ పెరుగుదల శాతం వివరాలు తప్పుగా పేర్కొన్నారు.
కందిపప్పు ధర కిలో రూ.45 నుంచి రూ.80కి పెరిగిందని వివరిస్తూ 77 శాతం ధర పెరిగిందని చెప్పాల్సింది పోయి 177 శాతం పెరిగిందన్నారు.
దాంతో గణితం కూడా రాని రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎలా అవుతారు అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు గుప్పించారు. ఆ తర్వాత దానిని సరి చేసుకున్నారు. రాహుల్ గాంధీ బీజేపీకి రోజూ ప్రశ్నలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.