వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర బడ్జెట్: అంతా షేర్-షాయరీలే, తడిసిన తారాజువ్వ: రాహుల్ గాంధీ పెదవి విరుపు

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈరోజు లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా షేర్-షాయరీలేనని, తీవ్రంగా నిరాశపరిచిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈరోజు లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా షేర్-షాయరీలేనని, తీవ్రంగా నిరాశపరిచిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. యువత కోసం, రైతుల కోసం కేంద్ర బడ్జెట్ లో ఏమీ లేదని పెదవి విరిచారు.

ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం అనంతరం పార్లమెంట్ వెలుపల మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ''మేం టపాసుల మోత మోగుతుందని ఆశించాం. తీరాచూస్తే బడ్జెట్ తడిసిపోయిన తారాజువ్వలా తుస్సుమంది..'' అని వ్యాఖ్యానించారు.

Rahul Gandhi on Budget 2017: No mention of job creation, big reforms for farmers

రాజకీయ పార్టీలకు విరాళాల విషయంలో పారదర్శకత పాటించే దిశగా తీసుకునే ఎలాంటి చర్యలకైనా తాము మద్దతు ఇస్తామన్నారు. బడ్జెట్ లో తాము మెరుపుల కోసం ఎదురు చూశామని, కానీ అలాంటివేమీ లేవని, బడ్జెట్ ప్రసంగం చాలా చప్పటీ ముగిసిందని రాహుల్ పేర్కొన్నారు.

దేశం నిరుద్యోగం, రైతాంగ సమస్యలు వంటి మౌలిక సమస్యలు ఎదుర్కొంటోందని, కానీ మోడీ ప్రభుత్వం మాత్రం యువతకు, రైతులకు ఉపశమనం కలిగించే కనీస చర్యలు కూడా బడ్జెట్ లో ప్రకటించలేకపోయిందని ఆయన ఎద్దేవా చేశారు.

English summary
Reacting to the Union Budget 2017, Congress vice-president Rahul Gandhi on Wednesday expressed disappointment over the lack of big reforms aimed at farmers. “Government wanted to make an impact with budget before polls. But there was no impact. Should have announced something big for farmers,” Rahul said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X