కేంద్ర బడ్జెట్: అంతా షేర్-షాయరీలే, తడిసిన తారాజువ్వ: రాహుల్ గాంధీ పెదవి విరుపు
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈరోజు లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా షేర్-షాయరీలేనని, తీవ్రంగా నిరాశపరిచిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు.
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈరోజు లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా షేర్-షాయరీలేనని, తీవ్రంగా నిరాశపరిచిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. యువత కోసం, రైతుల కోసం కేంద్ర బడ్జెట్ లో ఏమీ లేదని పెదవి విరిచారు.
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం అనంతరం పార్లమెంట్ వెలుపల మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ''మేం టపాసుల మోత మోగుతుందని ఆశించాం. తీరాచూస్తే బడ్జెట్ తడిసిపోయిన తారాజువ్వలా తుస్సుమంది..'' అని వ్యాఖ్యానించారు.

రాజకీయ పార్టీలకు విరాళాల విషయంలో పారదర్శకత పాటించే దిశగా తీసుకునే ఎలాంటి చర్యలకైనా తాము మద్దతు ఇస్తామన్నారు. బడ్జెట్ లో తాము మెరుపుల కోసం ఎదురు చూశామని, కానీ అలాంటివేమీ లేవని, బడ్జెట్ ప్రసంగం చాలా చప్పటీ ముగిసిందని రాహుల్ పేర్కొన్నారు.
దేశం నిరుద్యోగం, రైతాంగ సమస్యలు వంటి మౌలిక సమస్యలు ఎదుర్కొంటోందని, కానీ మోడీ ప్రభుత్వం మాత్రం యువతకు, రైతులకు ఉపశమనం కలిగించే కనీస చర్యలు కూడా బడ్జెట్ లో ప్రకటించలేకపోయిందని ఆయన ఎద్దేవా చేశారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications