హిండెన్బర్గ్ ఆరోపణలపై రాహుల్ గాంధీ స్పందన ఇదే: బీజేపీ కౌంటర్
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్కు సంబంధించి హిండెన్బర్గ్ తాజా నివేదిక (హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్)పై మరోసారి దుమారం రేపింది. ఈసారి సెబీ చైర్పర్సన్ మాధబి పూరీ బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్ పాత్రపై ప్రశ్నలు తలెత్తెలా చేసింది. మరోవైపు కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై మరోసారి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.
ఇన్వెస్టర్లు కష్టపడి సంపాదించిన సొమ్ముకు ప్రయోజనం లేకుంటే దానికి బాధ్యులెవరు అని రాహుల్ ప్రశ్నించారు. హిండెన్బర్గ్ తాజా నివేదికను అనుసరించి, బుచ్ దంపతులు మొదట ఆరోపణలను తిరస్కరిస్తూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇది కాకుండా, హిండెన్బర్గ్ ఆరోపణలు అన్యాయమని సెబి ఒక ప్రకటన విడుదల చేసింది.

అదే సమయంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం బడా పెట్టుబడిదారులకు అన్యాయం చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా, కొత్త హిండెన్బర్గ్ నివేదికను ప్రస్తావిస్తూ.. ఈ విషయంలో కేంద్రం ప్రవర్తన పక్షపాతంతో ఉందని అన్నారు. దీనిపై విపక్ష నేత రాహుల్ గాంధీ కూడా కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సెబీ ఛైర్ పర్సన్ పై ఆరోపణలతో సెబీ పవిత్రత దెబ్బతిందని విమర్శించారు.
'భారత్-ఆస్ట్రేలియా మధ్య ఇలాంటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరుగుతుందని ఊహించుకోండి, అంపైర్ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫలితం ఎలా ఉంటుంది, మ్యాచ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎలా భావిస్తారు? అని రాహుల్ ప్రశ్నించారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ, భారత స్టాక్ మార్కెట్లో సరిగ్గా ఇదే జరుగుతోంది, గత కొన్నేళ్లుగా, భారతదేశ స్టాక్ మార్కెట్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పెట్టుబడులు పెడుతున్నారు, వారు కష్టపడి సంపాదించిన, నిజాయితీగా సంపాదించిన పెట్టుబడిని పెడుతున్నారు. స్టాక్ మార్కెట్లో పొదుపులు "భారత స్టాక్ మార్కెట్లో గణనీయమైన ప్రమాదం ఉందని మీ దృష్టికి తీసుకురావడం ప్రతిపక్ష నాయకుడిగా (లోక్సభలో) నా కర్తవ్యం ఎందుకంటే స్టాక్ మార్కెట్ను నియంత్రించే సంస్థ రాజీపడింది అని రాహుల్ ఆరోపించారు.
ఇంత తీవ్రమైన ఆరోపణలు వచ్చినా సెబీ చీఫ్ ఎందుకు రాజీనామా చేయలేదని ప్రతిపక్ష నేత రాహుల్ ప్రశ్నించారు. ఆయన తన పదవి నుంచి వైదొలిగి తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయమైన విచారణకు సహకరించాలని అన్నారు. కొత్త తీవ్రమైన ఆరోపణలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఈ అంశాన్ని సుప్రీంకోర్టు మరోసారి సుమోటోగాపరిశీలిస్తుందా? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో జేపీసీ విచారణకు ప్రధానికి ఎందుకు భయపడుతున్నారో అర్థమైందని రాహుల్ చెప్పుకొచచారు.
తీవ్రంగా స్పందించిన సెబీ ఛైర్ పర్సన్
హిండెన్ బర్గ్ ఆరోపణలను మాధవీ పురి ఖండించారు. ఆ సంస్థ తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఆర్థిక రికార్డులను బహిర్గతం చేస్తామని చెప్పారు. తాము ప్రైవేటు వ్యక్తులుగా ఉన్న రోజుల్లో ఆర్థిక కార్యకలాపాల వివరాలను కూడా అధికారులకు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. మరోవైపు, అదానీ గ్రూప్ కూడా ఈ ఆరోపణలను కుట్రపూరితమేనంటూ కొట్టిపారేసింది. వ్యక్తిగత లాభం కోసం సమాచారాన్ని వక్రీకరిస్తూ మదుపరులను తప్పుదోవపట్టించేందుకు యత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
హిండెన్బర్గ్తో కాంగ్రెస్కు సంబంధాలు: బీజేపీ
సెబీ ఛైర్ పర్సన్ను లక్ష్యంగా చేసుకుని అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన తాజా నివేదికను రాజకీయ నాయకులు, ఆర్థిక నిపుణులు తోసిపుచ్చుతున్నారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నం జరుగుతోందని మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆరోపించారు. ఇది సెబీపై దాడిగా అభివర్ణించారు.
అంతేగాక, హిండెన్బర్గ్తో కాంగ్రెస్ పార్టీకి సంబంధాలున్నాయని సంచలన ఆరోపణలు చేశారు రాజీవ్ చంద్రశేఖర్. విదేశీ బ్యాంక్ హిండెన్బర్గ్ ద్వారా సెబీపై జరిగిన దాడిలో కాంగ్రెస్ తో స్పష్టమైన భాగస్వామ్యం కలిగివుంది. ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థలో ఒకదానిని అస్థిరపర్చడం, కించపర్చడం, ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాన్ని గందరగోళపర్చడమే వారి లక్ష్యం అని రాజీవ్ చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. కాగా, ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేవీ సుబ్రమణియన్ కూడా సెబీ చీఫ్ చిత్తశుద్ధిని సమర్థించారు.












Click it and Unblock the Notifications