రాహుల్ గాంధీ కారుపై రాళ్ల దాడి (వీడియో)
మాల్దా: భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న కారుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న కారు వెనుక అద్దం ధ్వంసమైంది. కాగా రాహుల్కు ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది.
మాల్దా జిల్లాలోని హరిశ్చంద్రపుర్లో రాహుల్ ప్రయాణిస్తున్న కారుపై దాడి జరిగిందని పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌదరి మీడియాకు తెలిపారు. ఇలాంటి దాడులు ఆమోదయోగ్యం కాదని అన్నారు. రాహుల్ను భయం లేని వ్యక్తిగా ఆయన అభివర్ణించారు. ఈ చర్యకు తృణమూల్ కాంగ్రెసే కారణమని ఆరోపించారు.

'కారు వెనుక నుంచి వచ్చి ఎవరైనా రాళ్లు రువ్వి ఉండొచ్చు. భద్రతా బలగాలు పట్టించుకోవట్లేదు. అందుకే ఇలాంటి ఘటన జరిగింది. చిన్న ఘటనే అయినా రాహుల్ ఏమైనా జరిగితే పరిస్థితి ఏంటి? రాహుల్కు సరైన భద్రత లేదు. ఇది ఎవరు చేయించారో మీకు అర్థమైందా? కాంగ్రెస్ ఎవరినీ అణగదొక్కదు. అడుగడుగునా రాహుల్ గాంధీని ఇబ్బందిపెడుతున్నారు' అని అధీర్ రంజన్ చౌధరి పరోక్షంగా టీఎంసీపై మండిపడ్డారు.
ఇది ఇలావుంటే, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు ఉండదని ఇటీవలే బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఒకవైపు మమత ఇంత స్పష్టంగా ఒంటరిగా పోటీచేస్తామని చెబుతుంటే.. కాంగ్రెస్ మాత్రం బంగాల్లో సీట్ల సర్దుబాటు అంశం ఇంకా హోల్డ్లోనే ఉన్నట్లు తెలపడం గమనార్హం. సీట్ల సర్దుబాటుపై తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నాయని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ తెలిపారు.
VIDEO | "Rahul Gandhi is a fearless man. What breach of security? There is no security at all," says Congress leader @adhirrcinc. pic.twitter.com/xW005cxO3L
— Press Trust of India (@PTI_News) January 31, 2024
టీఎంసీ ఇంకా ఇండియా పక్షంలో భాగమేనని చెప్పారు జైరాం రమేష్. కూటమిలో అందరు సభ్యులూ ఒకే గళంతో మాట్లాడాలని సూచించారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోలేమన్నారు. ఇండియా కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయన్నాయని తెలిపారు. ఒకవేళ ఎవరికి వారే విడివిడిగా పోరాడాలని నిర్ణయించుకుంటే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించాలని సూచించారు. బంగాల్లో టీఎంసీ ఇండియా కూటమితోనే పోరాడుతుందని తాము భావిస్తున్నట్లు జైరాం రమేష్ పేర్కొన్నారు. ఇప్పటికే జేడీయూ ఇండియా కూటమిని వదిలి ఎన్డీఏ కూటమిలో చేరిన విషయం తెలిసిందే. మరోవైపు, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా టీఎంసీ బాటలోనే వెళుతోంది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications