ఎంపీ మృతి: పార్లమెంటు ఎదుట రాహుల్ ఆందోళన
యూనియన్ ముస్లిం లీగ్ నేత ఇ అహ్మద్ మృతిపై పార్లమెంట్లో జరుగుతున్న ఆందోళనలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ పాల్గొన్నారు.
న్యూఢిల్లీ: యూనియన్ ముస్లిం లీగ్ నేత ఇ అహ్మద్ మృతిపై పార్లమెంట్లో జరుగుతున్న ఆందోళనలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ పాల్గొన్నారు. పార్లమెంట్ ప్రాంగణంలో కేరళకు చెందిన ఎంపీలు చేస్తున్న ఆందోళనలో పాల్గొని వారికి మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు ఎంపీలు నల్లటి రిబ్బన్ కట్టుకుని నిరసన తెలిపారు. దీనిపై ఇప్పటికే కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.

రామ్మనోహర్ లోహియా ఆసుపత్రి సిబ్బంది వ్యవహరించిన తీరుపై విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఇ అహ్మద్ మృతిపై చర్చించాలని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్, ఆర్ఎస్పీ నేత ఎన్.కె. ప్రేమ్చంద్రన్లు లోక్సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు.












Click it and Unblock the Notifications