సభలో రాహుల్ నిద్ర!(ఫోటో): బీజేపీ వ్యంగ్యం, కాంగ్రెస్ వివరణ
న్యూఢిల్లీ: ఏఐసిసి ఉపాధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ లోకసభలో కునుకు తీశారు. పార్లమెంటు లోకసభలో ధరల పెరుగుదల పైన సీరియస్గా చర్చ సాగుతున్న సమయంలో రాహుల్ గాంధీ తన కుర్చీలో నిద్రపోయారు. చర్చ సమయంలో రాహుల్ కునుకు తీశారంటూ భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత షాన్వాజ్ హుస్సేన్ ట్వీట్ చేశారు.
షాన్వాజ్.. రాహుల్ గాంధీ కునుకు పైన వ్యంగ్యంగానే ట్వీట్ చేశారు. 'ధరల పెరుగుదల పైన పార్లమెంటులో చర్చ జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీ నిద్రపోతు కనిపించారు. కాంగ్రెస్ పార్టీ తన పదేళ్ల పాలనలో ఇదే చేసింది.' అని ఎద్దేవా చేశారు.

దీనిపై కాంగ్రెసు పార్టీ వెంటనే స్పందించింది. ఇది పూర్తి అబద్దమని వ్యాఖ్యానించింది. రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. తన పార్లమెంటు జీవితంలో చాలామంది ఎంపీలు కునుకు తీయడం చూశానని చెప్పారు.
అయితే ఇంకొందరు చర్చను జాగ్రత్తగా వినేందుకు కళ్లు మూసుకుంటారని, రాహుల్ గాంధీ కునుకు తీశారనే వాదనలో నిజం లేదని, ఇది కూడా చర్చను జాగ్రత్తగా వినేందుకేనని ఆయన చెప్పారు. భారతీయ జనతా పార్టీ అగ్ర నేత అటల్ బిహారీ వాజపేయి కూడా చర్చను జాగ్రత్తగా వినేందుకు కళ్లు మూసుకునే వారని చెప్పారు. కాగా, సీపీఐ-ఎం నేత కరుణాకరన్ మాట్లాడే సమయంలో ఇది జరిగింది. కళ్లు మూసినంత మాత్రాన నిద్రపోయినట్లు కాదని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ అన్నారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications