రైల్వేలో ఏడాదిలో 10 లక్షల ఉద్యోగాలు: పీయూష్ గోయల్
ఏడాది కాలంలోనే 10 లక్షల ఉద్యోగాల కల్పనకు రైల్వే శాఖ సిద్దంగా ఉందని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రకటనరైల్వే భద్రతపై కేంద్రం కేంద్రీకరించింది.
న్యూఢిల్లీ: ఈ ఏడాదిలో 10 లక్షల ఉద్యోగాలను ఎకో సిస్టమ్ సృష్టించే అవకాశాలున్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభిప్రాయపడ్డారు.రైల్వేలో ప్రత్యక్షంగా ఉద్యోగాలు అందకపోయినప్పటికీ, ఈ వ్యవస్థలో వివిధ ఏరియాల్లో పనిచేసే వారికి 12 నెలల కాలంలోనే మిలియన్ కొద్ది ఉద్యోగాలు లభిస్తాయన్నారు మంత్రి పీయూష్ గోయల్.
కేవలం రైల్వేలు, దాని వ్యవస్థ మాత్రమే ఇన్ని ఉద్యోగాలను సృష్టించనుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, ఇండియా ఎకనామిక్ సమిట్ వద్ద గోయల్ చెప్పారు.రైల్వే ట్రాక్, భద్రత పరిరక్షణ ప్రొగ్రామ్లోనే 2 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని పీయూష్ గోయల్ చెప్పారు.
ఇటీవల జరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా రైల్వే భద్రతపై ప్రభుత్వం కేంద్రీకరించింది. ప్రస్తుతమున్న ప్రాజెక్టుల్లోనే 2 లక్షల నుంచి 2.5 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని కేంద్రమంత్రి పీయూష్ అభిప్రాయపడ్డారు.
భారీ పెట్టుబడి సామర్థ్యాన్ని భారత్ కలిగి ఉందని చెప్పారు పీయూష్ గోయల్. కానీ దేశం రూపాంతరం చెందడానికి ఆలోచనల్లో మార్పు రావాలన్నారు. పెట్టుబడి పెట్టడానికి ప్రపంచంలో ఏ దేశం కూడా మంచిగా లేదని పీయూష్ గోయల్ అభిప్రాయపడ్డారు.