తుఫాన్ దెబ్బకు పాకిస్థాన్ లో 50 మంది బలి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో తుఫాను భీభత్సం స్పృష్టించింది. 50 మందికి పైగా మరణించారు. 200 మందికి పైగ తీవ్రగాయాలై ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. పాకిస్తాన్ ప్రజలు బయటకురావాలంటేనే హడలిపోతున్నారు.
పాకిస్తాన్ లోని పెషావర్, నౌషరా, చారసద్దా తదితర ప్రాంతాలలో ఆదివారం భారీ వర్షాలు పడ్డాయి. ఇదే సమయంలో వర్షాలకు భారీ గాలులు తోడవడంతో ఆ పరిసర ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. పలు చోట్ల ఇండ్లు నేలమట్టంఅయ్యాయి. అనేక చోట్ల ఇండ్లు గొడలు చీలిపోయాయి.

విద్యుత్ స్థంభాలు,టెలిఫోన్ స్థంభాలు, మొబైల్ టవర్లు కుప్పకూలిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. పాక్ సైన్యం, పోలీసులు రక్షణా చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు.
పేషావర్ లోనే 29 మంది మరణించారు. పలు ఇండ్లు పూర్తిగా ద్వంసం అయ్యాయి. వేలాధి కుటుంబాలు రోడ్డునపడ్డాయి. పెషావర్ లో 18 సెం.మీ. వర్షపాతం అనమోదు అయ్యింది. 110 కిలోమీటర్ల వేగంగా గాలులు వీచాయని పాకిస్తాన్ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications