Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వామ్మో.. దేవుడిపై కోపంతో 15 ఏళ్లుగా ఈ HIV పేషంట్ ఏం చేస్తున్నాడో తెలుసా..?

హెచ్ఐవీ వ్యాధి బారిన పడిన ఓ వ్యక్తి తన అనారోగ్యానికి దేవుడే కారణం అని భావించాడు. అలా దేవుడిపైనే కోపం, పగ పెంచుకున్నాడు. దేవుడి మీద కోపంతో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. అలా 15 ఏళ్లుగా కేవలం గుళ్లలోనే చోరీలు చేయడం ప్రారంభించాడు. హుండీలోని నగదు, ఇతర కానుకలు మాత్రమే టార్గెట్ గా దొంగతనాలకు పాల్పడ్డాడు. 15 ఏళ్ల పాటు అనేక ఆలయాల్లో దోపిడీలకు పాల్పడిన ఈ గజదొంగ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.

సాధారణంగా పొట్టకూటి కోసం దొంగతనాలు చేస్తుంటారు. మరికొందరు విలాసవంతమైన లైఫ్ కోసం చోరీలకు పాల్పడుతుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం విచిత్రంగా దేవుడిపై కోపంతో దొంగతనాలకు పాల్పడుతున్నాడు. అదీ కూడా ఓ హెచ్ఐవీ పేషంట్ కావడం గమనార్హం. తన అనారోగ్యానికి దేవుడే కారణం అని భావించిన ఆ వ్యక్తి కేవలం గుడిలోనే చోరీలు చేస్తున్నాడు. అలా 15 ఏళ్లుగా అనేక ఆలయాల్లో దోపిడీలకు పాల్పడిన ఆ దొంగను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు.

ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పుర్ కు చెందిన 45 ఏళ్ల వ్యక్తి యశ్వంత్ ఉపాధ్యాయ్ 2012లో ఓ కేసులో అరెస్టై జైలుకు వెళ్లాడు. అయితే అప్పుడు తనకు హెచ్ఐవి వ్యాధి సోకిందని తేలింది. అయితే తన అనారోగ్యానికి దేవుడే కారణం అని భావించాడు. దీంతో జైలు నుంచి బయటకు వచ్చాక అనేక గుళ్లలో దోపిడీలు చేయడం ప్రారంభించాడు. ఇటీవల ఆగస్టు 23 అర్ధరాత్రి దుర్గ్ టౌన్ లోని ఓ జైన మందిరంలో యశ్వంత్ ఉపాధ్యాయ్ దోపిడీ చేస్తుండగా పోలీసులకు చిక్కాడు. వెంటనే అతడ్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. జడ్జి.. నిందితుడికి 14 రోజులపాటు జుడిషియల్ కస్టడీ విధించింది.

విచారణలో భాగంగా యశ్వంత్ ఉపాధ్యాయ్ చెప్పిన వివరాలు తెలిసి పోలీసులు షాక్ అయ్యారు. తనకు హెచ్ఐవీ ఉందని తేలిందని.. తన అనారోగ్యానికి దేవుడే కారణం అని దోపిడీలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. దేవుడిపై పగతో దేవుడి ఆస్తినే కాజేయాలని ప్లాన్ తో 15 ఏళ్లుగా కేవలం గుడిలో మాత్రమే దొంగతనాలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

Raipur Man s 15-Year Temple Theft Spree Fueled by Anger at God

ఇదే విషయంపై దుర్గ్ ఎస్పీ విజయ్ అగర్వాల్ మాట్లాడుతూ.. యశ్వంత్ ఉపాధ్యాయ్ మానసిక స్థితి సరిగా లేదని తెలిపారు. దేవుడి గుడుల్లో దొంగతనాలు చేసి ఆ తర్వాత ఆస్తులు కూడగట్టినట్లు తేలిందన్నారు. ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతాల్లోని దేవాలయాల్లో చోరీలకు పాల్పడేవాడని.. హుండీలోని నగదు, ఇతర కానుకలను దొంగిలించి పరారయ్యేవాడని తెలిపారు. దొంగతనం తర్వాత తాను ఆలయ విగ్రహం ముందుకి వెళ్లి నమస్కరించి పారిపోయేవాడినని నిందితుడు పోలీసుల విచారణలో తెలిపినట్లు ఎస్పీ పేర్కొన్నారు. యశ్వంత్ ఉపాధ్యాయ్ వ్యక్తిగత సమస్యలు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడని ఈ కారణంగా అతడు దేవునిపై కోపం పెంచుకున్నాడని తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+