దారుణం: విద్యార్థినిపై రేప్ చేసి చంపేసిన టీచర్
బికనీర్: విద్యార్థులకు మంచి మార్గం నడిపించాల్సిన ఉపాధ్యాయులే కీచకుడిలా మారిపోతున్నారు. ఓ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఓ దుర్మార్గుడు ఆమె ప్రాణం తీశాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. బికనీర్లో వ్యాయామ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి కామంతో పది హేడేళ్ల విద్యార్థినిపై లైంగిక దాడి చేసి అనంతరం చంపేశాడు. హాస్టల్ దగ్గర ఉన్న నీళ్ల ట్యాంకులో ఆమె మృతదేహాన్ని పడేశాడు.
తను ఎలాంటి నేరానికి పాల్పడలేదని ఆ ఉపాధ్యాయుడు తప్పించుకునే యత్నం చేశాడు. ఆ కాలేజీ యాజమాన్యం కూడా ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడిందని చెబుతోంది.
కాగా, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు రోజుల కిందటే ఆ బాలిక తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయుడు తనపై కొద్ది రోజులుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేసింది.
వారు స్పందించేలోగానే అతడు శుక్రవారం మరోసారి ఆ బాలిక లైంగిక దాడిజరిపి అనంతరం హత్య చేసి హాస్టల్ దగ్గర నీటి ట్యాంకులో పడేశాడు. పోస్టు మార్టం అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.